Begin typing your search above and press return to search.

మ‌హేష్ కోసం దిల్ రాజు టెర్రిఫిక్ ప్లాన్‌

By:  Tupaki Desk   |   30 April 2022 1:30 PM GMT
మ‌హేష్ కోసం దిల్ రాజు టెర్రిఫిక్ ప్లాన్‌
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టిస్తున్న యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ 'స‌ర్కారు వారి పాట‌' మ‌రో 12 రోజుల్లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. యంగ్ డైరెక్ట‌ర్ ప‌ర‌శురామ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. క్రేజీ హీరోయిన్ కీర్తి సురేష్ .. సూప‌ర్ స్టార్ కు జోడీగా న‌టిస్తున్నఈ మూవీని మైత్రీ మూవీమేక‌ర్స్‌, 14 ప్ల‌స్ రీల్స్‌, జీఎంబీ ఎంట‌ర్ టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మ‌హేష్ నుంచి 'స‌రిలేరు నీకెవ్వ‌రు' చిత్రం త‌రువాత సినిమా వ‌చ్చి దాదాపు రెండేళ్ల‌వుతోంది.

ఈ నేప‌న‌థ్యంలో 'స‌ర్కారు వారి పాట‌' ఎప్పుడెప్పుడు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేస్తుందా? ఎప్పుడెప్పుడు చూసేయాలా అని అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన టీజ‌ర్‌, మ‌హేష్ టెర్రిఫిక్ లుక్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేశాయి. అంతే కాకుండా ఇటీవ‌ల విడుద‌ల చేసిన క‌ళావతి.. ఎవ్రీ పెన్నీ.. స‌ర్కారు వారి పాట టైటిల్ సాంగ్ .. లిరిక‌ల్ వీడియోస్ కూడా నెట్టింట ఓ రేంజ్ లో వైర‌ల్ అవుతున్నాయి. ఇటీవ‌ల రెండు ద‌ఫాలుగా రిలీజ్ వాయిదా ప‌డిన ఈ చిత్రాన్ని మొత్తానికి మే 12న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు.

ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ప్ర‌మోష‌న్స్ ని హీరోయిన్ కీర్తి సురేష్‌ తో మొద‌లు పెట్టింది చిత్ర బృందం. సినిమా రిలీజ్ ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో కీర్తిసురేష్ ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూల‌తో ప్ర‌మోష‌న్స్ ని స్టార్ట్ చేసేసింది.

ఇక చిత్ర బృందం కూడా మ‌హేష్ ఫ్యాన్స్ ఎంత‌గానో ఎదురుచూస్తున్న ట్రైల‌ర్ రిలీజ్ డేట్ ని కూడా ప్ర‌క‌టించేశారు. ట్రైల‌ర్ ని మే 2న విడుద‌ల చేస్తున్నామంటూ మేక‌ర్స్ ఇటీవ‌ల ప్ర‌క‌టించ‌డంతో ఫ్యాన్స్ సెల‌బ్రేష‌న్స్ స్టార్ట్ చేసేశారు.

మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తొలిసారి క‌లిసి న‌టించిన 'ఆచార్య‌'. ఈ శుక్ర‌వారం భారీ స్థాయిలో విడుద‌లైన విష‌యం తెలిసిందే. ఈ మూవీ ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతున్న థియేట‌ర్ల‌లో 'స‌ర్కారు వారి పాట‌' ట్రైల‌ర్ ని ప్ర‌ద‌ర్శించ‌బోతున్నారు. మే 2 న విడుద‌ల కానున్న ట్రైల‌ర్ 'ఆచార్య‌' ప్ర‌దర్శింప‌బ‌డుతున్న థియేట‌ర్ల‌న్నింటిలోనూ ప్ర‌ద‌ర్శించ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదిలా వుంటే ఈ మూవీ నైజాం ఏరియా డిస్ట్రిబ్యూష‌న్ హక్కుల్ని స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు భారీ మొత్తానికి సొంతం చేసుకున్నారు.

అంతే కాకుండా భారీ స్థాయిలో ఈ మూవీని అత్య‌థిక థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఇందులో భాగంగా దిల్ రాజు ఎగ్జిబిట‌ర్ల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని, మే 2 న చ‌ర్చ‌లు ఓ కొలిక్కి రానున్నాయ‌ని తెలుస్తోంది. ఈ సినిమా కార‌ణంగా 'ఆచార్య‌' కు సంబంధించిన ఎన్ని థియేట‌ర్ల‌ల‌ని దిల్ రాజు బ్లాక్ చేయ‌బోతున్నార‌న్న‌ది ఇప్ప‌డు ఆస‌క్తిక‌రంగా మారింది.