Begin typing your search above and press return to search.

పూజా - సామ్ ల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందా...?

By:  Tupaki Desk   |   30 May 2020 6:50 AM GMT
పూజా - సామ్ ల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందా...?
X
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల మధ్య ఈగోలు మనస్పర్థలు ఎంతవరకు ఉంటాయో తెలియదు గాని హీరోయిన్స్ మధ్య మాత్రం ఖచ్చితంగా ఉంటాయనే టాక్ ఉంది. అందుకే ఎవరో ఒకరిద్దరు తప్పితే స్టార్ హీరోయిన్స్ లలో బెస్ట్ ఫ్రెండ్స్ పెద్దగా కనిపించరని అంటుంటారు. కాగా ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో అక్కినేని సమంత - బుట్ట బొమ్మ పూజా హెగ్డే మధ్య ఇలాంటి ఈగోలే ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పూజా హెగ్డే ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఒక స్టోరీ షేర్ అయింది. అందులో ''మ‌జిలీ'' సినిమాలోని స‌మంత ఫోటోను జ‌త చేస్తూ ''ఈమె నాకు పెద్ద‌గా అందంగా క‌నిపించ‌దు'' అంటూ కామెంట్ ఉంది. దీంతో సమంత ఫ్యాన్స్ పూజా హెగ్డే పై దాడికి దిగారు. ఆ తర్వాత ఈ విషయాన్ని తెలుసుకున్న పూజా హెగ్డే తన అకౌంట్ హ్యాక్‌ అయినట్లు చెప్పుకొచ్చింది. వెంటనే ఆమె ట్విట్టర్‌ లో దీనిపై స్పందిస్తూ.. ''తన ఇన్‌స్టా అకౌంట్ హ్యాక్‌ అయ్యిందని.. తన టీమ్ కష్టపడి మళ్లీ సరిచేశారని'' చెప్పారు. హ్యాక్ చేసిన వారిని తిట్టిపోసింది. ఇది నిజంగా హ్యాకర్లు చేసిన పనా లేక ఇంకేమైనా జరిగిందో తెలియదు కానీ స‌మంత అభిమానుల‌కు ఆగ్ర‌హం తెప్పించింది.

అకౌంట్ హ్యాక్ అయ్యింద‌ని పూజా వివ‌ర‌ణ ఇచ్చినా ఫ్యాన్స్ అవేం ప‌ట్టించుకోలేదు. బుట్ట బొమ్మ మీద ఫైర్ అవుతూనే ఉన్నారు. ఇది ఇద్దరి ఫ్యాన్స్ మధ్య ట్విట్టర్‌ లో వార్‌ గా మారింది. ఈ నేపథ్యంలో సమంత ఫ్యాన్స్‌ తమ అభిమాన నటికి పూజా హెగ్డే క్షమాపణ చెప్పాల్సిందేనంటూ సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు #PoojaMustApologizeSamantha అనే హ్యాష్‌ ట్యాగ్‌ తో వారు ట్వీట్లు పెడుతున్నారు. అయితే మరోవైపు #WeSupportPoojaHegde హ్యాష్‌ ట్యాగ్‌ తో పూజా ఫ్యాన్స్‌ ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. దీంతో ఈ రెండూ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయ్యాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఏ పేజీ చూసినా వీరిద్దరి గురించే మీమ్స్ పెడుతున్నారు. అయితే దీనికి తోడు డైరెక్ట‌ర్ నందినీ రెడ్డి - సింగర్ చిన్మ‌యి.. పూజా హెగ్డేను ఉద్దేశించి కామెంట్స్ చేసినట్లుగా ఇన్స్టాలో కామెంట్స్ పెట్టారు. 'నా బ్రెయిన్ కూడా హ్యాక్ అయ్యింది' అంటూ నంద‌నీ రెడ్డి కామెంట్ పెడితే.. 'ప్లీజ్ ల‌వ్ మీ టూ.. నా అకౌంట్ హ్యాక్ అవ్వ‌లేదు' అంటూ చిన్మ‌యి వ‌రుస కామెంట్లు పెడుతూ స‌మంత‌ - పూజా ల గురించే అనుకునేలా కామెంట్స్ చేసుకున్నారు. దీంతో నంద‌నీ రెడ్డి చిన్మయిలపై ఫైర్ అయ్యారు బుట్ట బొమ్మ ఫ్యాన్స్.

ఇదిలా ఉండగా ఇప్పుడు సామ్ ఇంస్టాగ్రామ్ స్టోరీ చూస్తే ప్రెజెంట్ జరుగుతున్న ఇష్యూ మీదే పెట్టినట్లుగా అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమంత తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఈ రోజు స్టోరీ పెడుతూ ''గుడ్ హార్ట్ కలిగి ఉండటం వలన వచ్చే మరొక సమస్య ఏమిటంటే, మీరు స్టుపిడ్ అని వారు భావిస్తుంటారు'' అని పెట్టింది. దీంతో ఇది సామ్ పూజా హెగ్డేని ఉద్దేశించే స్టోరీ పెట్టిందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి రాబోయే రోజుల్లో సామ్ - పూజా ఇష్యూ ఎంత దూరం వెళ్తుందో చూడాలి.