Begin typing your search above and press return to search.

రూ.200 కోట్ల భరణాన్ని సమంత రిజెక్టు చేసిందా?

By:  Tupaki Desk   |   4 Oct 2021 9:30 AM GMT
రూ.200 కోట్ల భరణాన్ని సమంత రిజెక్టు చేసిందా?
X
హాట్ టాపిక్ గా మారిన సమంత - నాగ చైతన్య విడాకుల విషయానికి సంబంధించి బోలెడన్ని విషయాలు చర్చకు వస్తున్నాయి. అందులో నిజం ఎంత? అబద్ధం? ఎంత అన్నది ఒక పెద్ద ప్రశ్నగా మారింది. వారిద్దరి విడాకులకు కారణం ఏమిటి? ఎందుకంత కఠిన నిర్ణయాన్ని తీసుకున్నారు? అన్న సందేహాలతో పాటు.. కొందరు సమంతను సమర్థిస్తుంటే.. మరికొందరు నాగచైతన్యకు మద్దతుగా నిలుస్తున్నారు.

అత్యధికులు మాత్రం చూడముచ్చటైన ఈ జంట విడిపోవటం ఏమిటి? నో.. అలా జరగకుండా ఉండాల్సింది. ఎవరో ఒకరు ఎంతో కొంత తగ్గి ఉంటే బాగుండేదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. మొత్తంగా విడాకుల నిర్ణయాన్ని అత్యధికులు రిజెక్టు చేస్తున్న పరిస్థితి. ఒక విధంగా చెప్పాలంటే.. గడిచిన ఆర్నెల్లుగా చైతన్య - సమంత విడాకుల విషయం వార్తల రూపంలో వచ్చినా.. అది వాస్తవమని అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత దాన్ని జీర్ణించుకోలేకపోతున్న వారే ఎక్కువ మంది.

ఇదిలాఉంటే.. ఈ విడాకులకు సంబంధించి ఒక ఆంగ్ల మీడియాకు సంబంధించి ఒక వైరల్ వార్త బయటకు వచ్చింది. దాని ప్రకారం.. విడాకుల నేపథ్యంలో సమంతకు భరణం రూపంలో రూ.200కోట్ల మొత్తాన్ని నాగచైతన్య ఆఫర్ చేసినట్లుగా చెబుతున్నారు. అయితే.. తనకు ఒక్క పైసా కూడా వద్దని చెప్పినట్లుగా తెలుస్తోంది. సాధారణంగా భార్యభర్తలు విడిపోతే.. భర్త ఆస్తి నుంచి కొంత వాటా భరణం రూపంలో భార్యకు దక్కుతుంది. తాజాగా సమంతకు అక్కినేని కుటుంబం నుంచి ఎంత మొత్తం భరణంగా వస్తుందన్నది పెద్ద చర్చగా మారింది.

ఇలాంటివేళ.. సమంత అక్కినేని వారు ఆఫర్ చేసిన భారీ మొత్తానికి నో చెప్పటమే కాదు.. ఒక్క పైసా కూడా తనకు అక్కర్లేదన్న మాట ఆమె నోటి నుంచి వచ్చినట్లుగా సదరు కథనంలో పేర్కొన్నారు. ఇదంతా తమకు ఇరువురి సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారంతో చెబుతున్నట్లుగా పేర్కొన్నారు. తనకు భరణం అవసరంలేదని.. సొంతంగా తాను సంపాదించుకోగలనని సమంత స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. విడాకుల వ్యవహారంతో సమంత మనసు ముక్కలూందని.. దీని నుంచి ఆమె బయటకు రావటానికి చాలా కాలం పడుతుందన్న ప్రచారం సాగుతోంది. మరి.. భరణం విషయంలో తాజాగా బయటకు వచ్చిన వార్తల్లో నిజమెంతో తేలాల్సి ఉంది.