Begin typing your search above and press return to search.

సామ్ న్యూ ఇయ‌ర్ ప్లానేంటో తెలుసా?

By:  Tupaki Desk   |   31 Dec 2021 2:30 PM GMT
సామ్ న్యూ ఇయ‌ర్ ప్లానేంటో తెలుసా?
X
స‌మంత‌... ఈ ఏడాది ఈ పేరు ట్రెండ్ అయినంత‌గా ఏ పేరు ట్రెండ్ కాలేదు. మీడియా, సోష‌ల్ మీడియా.., యూట్యూబ్ .. ఇలా ఒక‌టేమిటీ ఏ ప్లాట్ ఫామ్ వెతికినా స‌మంత పేరే వినిపించింది. ఈ ఏడాది ఆమె న‌టించిన సినిమా ఏదీ విడుద‌ల కాక‌పోయినా వ్య‌క్తిగ‌త విష‌యం కార‌ణంగా స‌మంత ఈ ఏడాది హాట్ టాపిక్ గా నిలిచింది. సామ్ న‌టించిన తొలి వెబ్ సిరీస్ `ది ఫ్యామిలీ మ్యాన్ సీజ‌న్ - 2`. ఇందు లో రాజీగా న‌టించి జాతీయ స్థాయిలో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంది.

దీని త‌రువాతే సామ్ వ‌రుస‌గా వార్త‌ల్లో నిల‌వ‌డం మొద‌లైంది. ఈ వెబ్ సిరీస్ తో సామ్ అందుకున్న ప్ర‌శంస‌లు ఎంతో కాలం నిల‌వ‌లేదు. అక్టోబ‌ర్ లో హీరో నాగ‌చైత‌న్య‌తో తాను విడిపోతున్న‌ట్టుగా సోష‌ల్ మీడియా వైదిక‌గా ప్ర‌క‌టించి షాకిచ్చింది. ఈ సంఘ‌ట‌న‌తో కొంత మ‌నస్థాపానికి గురైన ఆమె త‌న స్నేహితురాలు శిల్పారెడ్డితో క‌లిసి తీర్థ యాత్ర‌లు చేసిన విష‌యం తెలిసిందే. విడాకుల వివాదం నుంచి తేరుకున్న సామ్ వెంట‌నే ఓ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేయ‌డ‌మే కాకుండా `పుష్ప‌`లో స్పెష‌ల్ సాంగ్ కి సై అనేసింది.

`ఊ.. అంటావా మావ‌.. ఊఊ అంటావా..` అంటూ ఈ పాట దుమ్ములేపుతోంది. తొలిసారి చేసిన ఐట‌మ్ సాంగ్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావ‌డంతో స‌మంత రెట్టించిన ఉత్సాహంతో వుంది. ఇదే ఊపులో లేడీ ఓరియెంటెడ్ మూవీ `య‌శోద‌`లో న‌టిస్తోంది. సూప‌ర్ నేచుర‌ల్ ప‌వ‌ర్స్ నేప‌థ్యంలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ మూవీని శ్రీ‌దేవి మూవీస్ అధినేత శివ‌లెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

ప్ర‌స్తుతం ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. ఇదిలా వుంటే ఈ ఏడాది చేదు జ్ఞాప‌కాల‌తో పాటు స‌రికొత్త అనుభ‌వాల్ని ఎదుర్కొన్న సామ్ నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల కోసం ప్ర‌త్యేకంగా ప్లాన్ లు వేసుకుంటోంది. త‌న న్యూ ఇయ‌ర్ ప్లాన్స్ గురించి స‌మంత తాజాగా ఓ నేష‌న్ మీడియాకు వెల్ల‌డించింది.

స‌వాళ్ల నుంచి బ‌య‌ట‌ప‌డటానికి త‌న‌కు మోర‌ల్ సోర్ట్ ని అందించే స్నేహితులున్నార‌ని చెప్పిన స‌మంత ఈ ఏడాది న్యూ ఇయ‌ర్ రోజుని వారితో ప్ర‌త్యేకంగా గ‌డ‌పాల‌నుకుంటున్నాన‌ని తెలిపింది. ఈ ఏడాది పొడ‌వునా త‌న‌ని ఆనందంగా వుండేలా చేసిన గొప్ప స్నేహితులు త‌న‌కు వున్నార‌ని, కాబ‌ట్టి ఈ న్యూ ఇయ‌ర్ ని వారితో, ఇంకా త‌న కుక్క‌ల‌తో పాటు త‌న త‌ల్లితో గ‌డ‌పాల‌నుకుంటున్నాన‌ని తెలిపింది స‌మంత‌.

స‌మంత న‌టిస్తున్న‌ `శాకుంత‌లం` చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్యక్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. త్వ‌ర‌లోనే ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ ని రిలీజ్ చేయాల‌ని ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్ర‌క‌ట‌న జ‌న‌వ‌రి 1న వ‌చ్చే అవ‌కాశం వుంద‌ని తెలిసింది. న‌య‌న‌తార‌, విజ‌య్ సేతుప‌తితో క‌లిసి స‌మంత న‌టిస్తున్న త‌మిళ చిత్రం వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి న‌య‌న‌తార ప్రియుడు విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.