Begin typing your search above and press return to search.

రౌడీ స్టార్ పంథా మార్చుకున్నారా?

By:  Tupaki Desk   |   27 April 2022 5:30 PM GMT
రౌడీ స్టార్ పంథా మార్చుకున్నారా?
X
రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ 'అర్జున్ రెడ్డి' చిత్రంతో ఓవ‌ర్ నైట్ లో స్టార్ హీరో ల జాబితాలో చేరిపోయాడు. ఎక్క‌డా చూసినా.. ఏ హీరో క్యాంప్ లో విన్నా విజ‌య్ దేవ‌ర‌కొండ గురించే చ‌ర్చ జ‌రిగేది. ఇక త‌నదైన పంథాలో ఓపెన్ గా మాట్లాడుతూ విజ‌య్ కూడా త‌న‌దైన మార్కుని సెట్ చేసుకున్నాడు. దీంతో అత‌నంటే ఫ్యాన్స్ లో భారీ క్రేజ్ ఏర్ప‌డింది. త‌న క్రేజ్ నే బ్రాండ్ ఇమేజ్ గా మార్చుకుని రౌడీ బ్రాండ్ పేరుతో క్లాతింగ్ రంగంలోకి ప్ర‌వేశించి యుత్ లో భారీ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్నాడు.

అయితే ఆ క్రేజ్ ని కంటిన్యూ చేయ‌డంలో కెరీర్ ప‌రంగా త‌డ‌బ‌డ్డాడు. సినిమాల ఎంపిక విష‌యంలో జ‌రిగిన పొర‌పాట్ల వల్ల కెరీర్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ ప‌రాజ‌యాల్ని ద‌క్కించుకోవ‌డ‌మే కాకుండా హీరోగా త‌న క్రేజ్ ని కొంత వ‌ర‌కు కోల్పోవాల్సి వ‌చ్చింది. అంతే కాకుండా త‌ను ఎంచుకున్న సినిమా కార‌ణంగా కొంత మేర మార్కెట్ కూడా త‌గ్గింది. ఇక సినిమాల బిజినెస్ విష‌యంలో నూ పెద్ద‌గా బ‌జ్ క‌నిపించ‌డం త‌గ్గింది.

మామూలుగా విజ‌య్ దేవ‌ర‌కొండ సోష‌ల్ మీడియా వేదిక‌గా చేసే హంగామా అంతా ఇంతా కాదు. ప్ర‌తీ అకేష‌న్ ని సోష‌ల్ మీడియా వేదిక‌గా సెల‌బ్రేట్ చేసుకుంటూ అందులో భారీ సంఖ్య‌లో ఫ్యాన్స్ ని ఇన్ వాల్వ్ చేస్తూ వార్త‌ల్లో నిల‌వ‌డం విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌త్యేక‌త‌.

క్రిస్మ‌స్ వేడుక‌ల‌తో పాటు స‌మ్మ‌ర్ లో ఐస్ క్రీమ్స్ పంచ‌డం.. కోవిడ్ టైమ్ లో ఆర్థికంగా ఇబ్బందుల్లో వున్న కుటుంబాల‌కు నిత్యావ‌సరాలు అందించి అండ‌గా వుండ‌టం వంటి కార్య‌క్ర‌మాల‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా నిలిచారు.

కానీ ఇప్ప‌డు ఆయ‌న త‌న పంథా మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. గ‌తంలో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తూ ఫ్యాన్స్ లో జోష్ ని నింపే విజ‌య్ దేవ‌ర‌కొండ గ‌త కొంత కాలంగా త‌న పంథాకు భిన్నంగా సైలెంట్ అయిపోయారు. క్రేజీ పోస్ట్ ల వైపు వెళ్ల‌కుండా సాధార‌ణంగా త‌న సినిమాల‌కు సంబంధించిన పోస్ట్ ల‌ని మాత్ర‌మే షేర్ చేస్తూ సీరియ‌స్ గా త‌న ప‌ని తాను చేసుకుపోతుండ‌టం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది.

అంతే కాకుండా క్రేజీ చిత్రాలు ట్రిపుల్ ఆర్‌, కేజీఎఫ్ 2 రిలీజ్ ల కార‌ణంగా అంతా త‌మ దృష్టిని ఈ సినిమాపై మ‌ళ్లించ‌డం వ‌ల్ల కూడా విజ‌య్ సంద‌డి సోష‌ల్ మీడియాలో బాగా త‌గ్గింది అన‌డం కంటే విజ‌య్ దేవ‌ర‌కొండ‌నే హ‌డావిడి చేయ‌డానికి దూరంగా వుంటున్నార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం విజ‌య్ దేవర‌కొండ న‌టించిన 'లైగ‌ర్‌' ఆగ‌స్టులో రిలీజ్ కాబోతోంది. మ‌రో ప‌క్క 'జ‌న‌గ‌ణ‌మ‌న‌'తో పాటు శివ నిర్వాణ తో సినిమాలు చేస్తున్నారు. ఈ రెండు చిత్రాలు ప్ర‌స్తుతం చిత్రీకర‌ణ ద‌శ‌లో వున్నాయి.