Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ క్రేజీ ప్రాజెక్ట్ కు బ్రేకిచ్చారా?

By:  Tupaki Desk   |   17 Jun 2022 11:30 AM GMT
ప్ర‌భాస్ క్రేజీ ప్రాజెక్ట్ కు బ్రేకిచ్చారా?
X
పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ బ్యాక్ టు బ్యాక్ రెండు క్రేజీ ప్రాజెక్ట్ లు చేస్తున్నారు. బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ డైరెక్ష‌న్ లో చేస్తున్న మైథ‌లాజిక‌ల్ మూవీ 'ఆదిపురుష్‌' చిత్రీక‌ర‌ణ పూర్త‌యి ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్లో భాగంగా వీఎఫ్ ఎక్స్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 12న అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జ‌రుగుతున్నాయి.

దీంతో ప్ర‌భాస్ త‌న దృష్టిని 'స‌లార్‌', ప్రాజెక్ట్ కె చిత్రాల‌పై పెట్టారు. నాగ్ అశ్విన్ డైరెక్ష‌న్ లో భారీ చిత్రాల నిర్మాత సి. అశ్వ‌నీద‌త్ వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ పై దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నారు.

సైన్స్ ఫిక్ష‌న‌ల్ స్టోరీగా ఈ మూవీని రూపొందిస్తున్నారు. హిమాల‌యాల్లోని ఓ గుహ నేప‌థ్యంలో సాగే అడ్వెంచ‌ర‌స్ థ్రిల్ల‌ర్ గా ఈ సినిమా వుండ‌బోతోంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ క్రేజీ లేడీ దీపిక ప‌దుకునే హీరోయిన్ గా, అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.

తాజాగా ఈ ప్రాజెక్ట్ లోకి దిషా ప‌టాని కూడా చేరింది. భారీ అంచ‌నాల మ‌ధ్య చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ మూవీ షూటింగ్‌ ప్ర‌స్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జ‌రుగుతోంది. అయితే ఉన్న‌ట్టుండి హీరో ప్ర‌భాస్ ముంబైలోని బాంద్రాలో ప్ర‌త్య‌క్షం కావ‌డం.. దానికి ముందు హీరోయిన్ దీపికా ప‌దుకునే హార్ట్ బీట్ ప‌ల్స్ రేట్‌ ఇబ్బంద‌క‌రంగా మారిందంటూ హాస్పిట‌ల్ లో చేర‌డంతో 'ప్రాజెక్ట్ కె' షూటింగ్ కు బ్రేకిచ్చారంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి.

చిత్ర బృందం మాత్రం ఇవ‌న్నీ రూమ‌ర్సేన‌ని, షూటింగ్ కు ఎక్క‌డా బ్రేక్ ఇవ్వ‌లేద‌ని, హాస్పిట‌ల్ నుంచి డిశ్చార్జ్ అయిన దీపిక నేరుగా షూటింగ్ సెట్ కే వ‌చ్చేసి షూట్ లో పాల్గొంటున్నార‌ని స్ప‌ష్టం చేస్తున్నార‌ట‌. అంతే కాకుండా దీపిక స్ట్రెస్ ఫీల్ అవ‌డానికి కార‌ణం త‌న‌పై గ‌త కొన్ని రోజులుగా హెవీ స్టంట్ యాక్ష‌న్‌ సీన్ ల‌ని, ఆ కార‌ణంగానే త‌న ప‌ల్స్ రేట్ బాగా పెరిగిపోయింద‌ని అదే దీపిక‌ను ఆందోళ‌న‌కు గురిచేసింద‌ని ఇన్ సైడ్ టాక్‌.

అయితే మ‌రో వ‌ర్గం వాద‌న మ‌రోలా వుంది. దీపిక ఆరోగ్యం కుదుట ప‌డేవర‌కు షూటింగ్ బ్రేక్ ఇవ్వ‌మ‌ని ప్ర‌భాస్ చిత్ర బృందానికి స‌ల‌హా ఇచ్చార‌ట‌. ఆ కార‌ణంగా 'ప్రాజెక్ట్ కె' షూటింగ్ కి రామోజీ ఫిల్మ్ సిటీలో మేక‌ర్స్ బ్రేకిచ్చార‌ని, షూటింగ్ కి బ్రేచ్చారు కాబ‌ట్టే ప్ర‌భాస్ ముంబై వెళ్లార‌ని అంటున్నారు.