Begin typing your search above and press return to search.

నాగ్ అశ్విన్ కంటే ముందే ఓం రౌత్ కి క‌మిట‌య్యాడా?

By:  Tupaki Desk   |   18 Nov 2020 4:30 AM GMT
నాగ్ అశ్విన్ కంటే ముందే ఓం రౌత్ కి క‌మిట‌య్యాడా?
X
ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా రాధే శ్యామ్ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా పూర్త‌వుతోంది. పెండింగ్ చిత్రీక‌ర‌ణ‌లు ముగించి ఈ సినిమాని 2021 ప్ర‌థ‌మార్థంలో రిలీజ్ చేసేందుకు చిత్ర‌బృందం స‌న్నాహ‌కాల్లో ఉంది. మ‌హ‌మ్మారీ దూకుడు ఇప్పుడిప్పుడే త‌గ్గుతుండ‌డంతో భ‌విష్య‌త్ పై ఆశావ‌హం ధృక్ప‌థం క‌నిపిస్తోంది.

ప్ర‌భాస్ చాలాకాలం క్రిత‌మే రాధే శ్యామ్ ఐరోపా షెడ్యూల్ పూర్తి చేశాడు. ఆ త‌ర్వాత క‌రోనా క్రైసిస్ స‌మ‌యంలో కొంత‌కాలం ప్రభాస్ ముంబైలో క‌థ‌లు వినే ప‌నిలో ఉన్నారు. తానాజీ ఫేం ఓం రౌత్ వినిపించిన `ఆదిపురుష్ 3డి` కోసం లుక్ టెస్ట్ కూడా చేశారని గుస‌గుస‌లు వినిపించాయి. రాధే శ్యామ్ పూర్తి చేసిన వెంటనే ప్రభాస్ వెంటనే ఆదిపురుష్ లో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశార‌ని ప్ర‌స్తుతం భావిస్తున్నారు.

అయితే ప్ర‌భాస్ హైద‌రాబాద్ కి రాగానే ఇక్క‌డ మ‌హాన‌టి ఫేం నాగ్ అశ్విన్ - అశ్వ‌నిద‌త్ బృందంతో ఒక భారీ పాన్ ఇండియా సినిమాని ప్ర‌క‌టించేశారు. నిజానికి నాగ్ అశ్విన్ కంటే ముందే ఓంరౌత్ ప్ర‌భాస్ ని క‌లిసినా ఆ ప్రాజెక్టును ప్ర‌క‌టించ‌లేదు. కానీ నాగ్ అశ్విన్ తో ప్రాజెక్టును తొలిగా ప్ర‌క‌టించ‌డంతో అభిమానుల్లో ఒక‌టే క‌న్ఫ్యూజ‌న్ నెల‌కొంది. ఇక ద‌త్ బృందంతో ప్ర‌భాస్ సెట్స్ కెళ‌తారు అనే అంతా భావించారు.

కానీ ఆదిపురుష్ 3డినే ముందుగా ప్రారంభించేందుకు ప్ర‌భాస్ ఆస‌క్తిగా ఉన్నార‌ని తాజాగా క‌థ‌నాలొస్తున్నాయి. దీనిపై మ‌రింత వివ‌రంగా వెళితే.. ఓం రౌత్ తో పాటు నాగ్ అశ్విన్ కూడా ప్ర‌భాస్ తో సినిమాని ప్రారంభిస్తార‌ని ప్యార‌ల‌ల్ గానే షూటింగులు చేస్తార‌ని భావించినా అది వీలు ప‌డ‌ద‌ని తెలుస్తోంది. తాజా క‌థనాల ప్ర‌కారం.. ఓంరౌత్ ఆదిపురుష్ చిత్రీక‌ర‌ణ‌ను వేగంగా పూర్తి చేస్తాన‌ని ప్ర‌భాస్ కి ప్రామిస్ చేశార‌ట‌. అంటే అప్ప‌టివ‌ర‌కూ నాగ్ అశ్విన్ వెయిట్ చేస్తారు. ప్రామిస్ తీసుకున్నారు కాబ‌ట్టే అంగీక‌రించి ఉంటార‌ని ఊహాగానాలు సాగుతున్నాయి.

నాగ్ అశ్విన్ సినిమాకు ప్రభాస్ నుండి చాలా డేట్స్ అవసరం అందుకే ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్ తక్కువ సమయం లో షూట్ పూర్తి చేస్తానని ప్ర‌భాస్ కి ప్రామిస్ చేశార‌ట‌. అలాగే ప్రభాస్ కూడా ఓం రౌత్ చిత్రానికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఈ కార‌ణం వ‌ల్లా నాగ్ అశ్విన్ వేచి చూడాల్సి వ‌స్తోంద‌న్న గుస‌గుసా వినిపిస్తోంది. నాగ్ అశ్విన్ ఈ సమయాన్ని ప్రీ-ప్రొడక్షన్ పనుల కోసం తాపీగా ఉపయోగిస్తున్నారట‌. అమితాబ్.. దీపిక వంటి టాప్ స్టార్లు నాగ్ అశ్విన్ - ప్ర‌భాస్ సినిమాలో న‌టించ‌నున్నారు.