Begin typing your search above and press return to search.

రెండు ప్లాప్‌ లతో మహేష్‌ పై భారం వేసందా?

By:  Tupaki Desk   |   5 Nov 2020 6:10 PM GMT
రెండు ప్లాప్‌ లతో మహేష్‌ పై భారం వేసందా?
X
మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్‌ పలు సినిమాల్లో నటించింది. అయితే మళ్లీ ఆస్థాయిలో సక్సెస్‌ ను దక్కించుకోలేక పోయింది. కనీసం ఒక యావరేజ్‌ హిట్‌ కూడా ఈమెకు దక్కిన దాఖలాలు లేవు. తమిళంలో విజయ్‌ తో ఒక సినిమాను చేసినా ఆ సినిమా కీర్తికి పేరును తెచ్చిపెట్టలేక పోయింది. ఇక పెంగ్విన్‌.. మిస్‌ ఇండియా.. గుడ్‌ లక్‌ సఖి అంటూ మూడు లేడీ ఓరియంటెడ్‌ సినిమాలను ఈ అమ్మడు చేసింది. ఈ మూడులో రెండు పెంగ్విన్‌ మరియు మిస్‌ ఇండియా సినిమాలు ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఓటీటీ ద్వారా విడుదలైన ఆ రెండు సినిమాలు నిరాశ పర్చాయి.

ఆ సినిమాల షాక్‌ నుండి బయట పడాలంటే ఖచ్చితంగా ఈ సమయంలో కీర్తి సురేష్‌ కు ఒక మంచి కమర్షియల్‌ సక్సెస్‌ కావాల్సి ఉంది. ఇలాంటి సమయంలో ఈమె చేస్తున్న సూపర్‌ స్టార్‌ మూవీ సర్కారు వారి పాటపై ఈమె అంచనాలు పెంచుకుంది. ఆ సినిమా గురించి చాలా నెలల క్రితమే ఎగ్జైట్‌ అయ్యి నటిస్తున్నట్లుగా చెప్పింది. ఈమద్య చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా సర్కారు వారి పాట సినిమాలో కీర్తి సురేష్‌ నటిస్తున్నట్లుగా ప్రకటించారు. సినిమా కోసం ఆమె చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా ఆమె మాటల ద్వారా అర్థం అవుతోంది.

ఇటీవల మిస్‌ ఇండియా ప్రమోషన్‌ లో భాగంగా సర్కారు వారి పాట సినిమా కోసం చాలా ఎగ్జైట్‌ గా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది. ఆ సినిమాలోని తన పాత్ర మరియు ఒక పాటలో తాను కనిపించబోతున్న విధానం గురించి కీర్తి సురేష్‌ మళ్లీ మళ్లీ చెప్పుకుంటూ ఉంది. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో కీర్తి సురేష్‌ కనిపించబోతుందట. అహంకారిగా కాస్త పొగరుగా కీర్తి సురేష్‌ పాత్ర ఉంటుందట. ఇక ఈ పాత్ర కోసం తానే స్వయంగా డబ్బింగ్‌ చెప్పుకోబోతున్నట్లుగా కూడా కీర్తి చాలా సంబురంగా చెప్పింది. మొత్తానికి ఈ సినిమాతో తన స్టార్‌ డం మరింత పెంచుకోవాలని అలాగే తన గత ప్లాప్‌ ల భారంను తగ్గించుకునేందుకు కీర్తి సురేష్‌ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తోంది.