Begin typing your search above and press return to search.

జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఫైన‌ల్ అయిన‌ట్టేనా?

By:  Tupaki Desk   |   31 March 2022 2:30 AM GMT
జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఫైన‌ల్ అయిన‌ట్టేనా?
X
అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి ముద్దుల కూతురు జాన్వీ క‌పూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌బోతోందంటూ గ‌త క‌న్నేళ్లుగా వ‌రుస క‌థ‌నాలు వినిపిస్తూనే వున్నాయి. 'జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి' చిత్రాన్ని రీమేక్ చేస్తే అందులో రామ్ చ‌ర‌ణ్‌, జాన్వీ కపూర్ న‌టిస్తుంద‌ని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. అదీ జ‌ర‌గ‌లేదు. ఆ త‌రువాత స్టార్ డైరెక్ట‌ర్స్ త‌మ సినిమాల్లో జాన్వీని హీరోయిన్ గా తీసుకుంటున్నారంటూ ప్ర‌చారం జ‌రిగింది. కానీ నో రిజ‌ల్ట్‌.. మెహెర్ ర‌మేష్‌, నాగార్జున.. ఇటీవ‌ల పూరి జ‌గ‌న్నాథ్ కూడా జాన్వీని టాలీవుడ్ కు ప‌రిచ‌యం చేయాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశారు. అది ఎవ్వ‌రి వ‌ల్లా కాలేదు.

'లైగ‌ర్‌'తో జాన్వీ ఎంట్రీ ఖాయ‌మ‌నే న్యూస్ కూడా వినిపించింది కానీ ఆ స్థానంలో చివ‌రికి పూరి ...అన‌న్య పాండేని తీసుకున్నారు. చాలా మంది డైరెక్ట‌ర్ లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నా ఏదీ కార్య‌రూపం దాల్చ‌లేదు.

కానీ బోనీ క‌పూర్ మాత్రం ఎప్ప‌టిక‌ప్ప‌డు జాన్వీ టాలీవుడ్ లోకి ఖ‌చ్చితంగా ఎంట్రీ ఇస్తుందంటూ ప్ర‌క‌టిస్తూనే వున్నాడు. అయితే తాజాగా పూరి వ‌ల్లే జాన్వీ క‌పూర్ టాలీవుడ్ కు ప‌రిచ‌యం అయ్యే అవ‌కాశాలు వున్న‌ట్టుగా తెలుస్తోంది.

రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ తో 'లైగ‌ర్‌' మూవీని చేస్తున్న పూరి జ‌గ‌న్నాథ్ ఈ మంగ‌ళ‌వారం త‌నతోనే మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ 'జ‌న‌గ‌ణ‌మ‌న‌'ని ప్రారంభించారు. విజయ్ దేవ‌ర‌కొండ మిల‌ట‌రీ ఆఫీస‌ర్ గా ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో న‌టిస్తున్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఏప్రిల్ నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ నేప‌థ్యంలో ఈ చిత్రంలో విజ‌య్ కి జోడీగా జాన్వీ క‌పూర్ న‌టించ‌బోతున్న‌ట్టుగా బాలీవుడ్ మీడియాలో ఆస‌క్తిక‌ర క‌థ‌నాలు వినిపిస్తున్నాయి.

ఇప్ప‌టికే పూరి జ‌గ‌న్నాథ్ స్టార్ ప్రొడ్యూస‌ర్ క‌ర‌ణ్ జోహార్ ద్వారా జాన్వీ క‌పూర్ ని సంప్ర‌దించార‌ని, పూరి చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో జాన్వీ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింద‌ని బాలీవుడ్ మీడియాలో క‌థ‌నాలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్త‌ల‌పై జాన్వీ టీమ్ మాత్రం స్పందించ‌డం లేదు.

క‌నీసం ఈ వార్త‌ల‌ని ఖండించ‌డం లేదు. దీంతో జాన్వీ క‌పూర్ టాలీవుడ్ ఎంట్రీ పూరి సినిమాతో ఖ‌రారు కానుంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతున్న‌ట్టుగా బాలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. త్వ‌ర‌లోనే పూరి ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించే అవ‌కాశం వుంద‌ని కూడా వినిపిస్తోంది.