Begin typing your search above and press return to search.

డెబ్యూ హీరోకు అంత బడ్జెట్ పెట్టారా?

By:  Tupaki Desk   |   25 May 2020 5:00 AM GMT
డెబ్యూ హీరోకు అంత బడ్జెట్ పెట్టారా?
X
కొత్త హీరోల మీద ఎక్కువ బడ్జెట్ ఖర్చు పెట్టడం ఎప్పుడూ రిస్క్ తో కూడుకున్న పనే. బెల్లంకొండ శ్రీనివాస్ డెబ్యూ సినిమాల లాంటివి ఎక్సెప్షన్. కొత్త హీరోల మీద భారీ బడ్జెట్ పెడితే వెనక్కు రాదనేది ట్రేడ్ వర్గాల మాట. మెగా కుటుంబం నుంచి పరిచయం అవుతున్న పంజా వైష్ణవ్ తేజ్ సినిమాపై మైత్రీ వారు భారీ బడ్జెట్ పెట్టారని టాక్ వినిపిస్తోంది.

బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు దాదాపు రూ. 18 కోట్లు పెట్టారని సమాచారం. కొత్త హీరో మీద ఇంత పెట్టుబడి ఎప్పుడైనా రిస్కే. అందుకే సుకుమార్ ను రంగంలోకి దించి కరెక్షన్ చేయిస్తున్నారట. ఈ సినిమాకు కథ అందించింది సుకుమారే కానీ ఎక్కువ బడ్జెట్ రికవరీ కావాలంటే సినిమాలో లాగ్ ఉండకూడదని.. లోటుపాట్లు ఏవైనా ఉంటే రిలీజుకు ముందే సెట్ చెయ్యాలని ప్లాన్ చేసుకున్నారట. అయితే సుకుమార్ సీన్లు కట్ చేయమని సూచిస్తే ఫర్వాలేదు కానీ రీ షూట్ చేయమని చెప్పకపోతే మేలని మాత్రం మైత్రీ వారు అనుకుంటున్నారట.

మరి ఈ మార్పుచేర్పులు 'ఉప్పెన' సినిమాను విజయతీరాలకు చేరుస్తాయా అనేది వేచి చూడాలి. షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఏప్రిల్ లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది కానీ థియేటర్లు మూసి ఉండడంతో వాయిదా పడింది. త్వరలోనే ఈ సినిమా విడుదల విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.