Begin typing your search above and press return to search.

ధ‌నుష్ మ‌రోసారి డ‌బుల్ ట్రీట్ కి రెడీ అయిపోయాడు

By:  Tupaki Desk   |   12 Feb 2022 2:30 AM GMT
ధ‌నుష్ మ‌రోసారి డ‌బుల్ ట్రీట్ కి రెడీ అయిపోయాడు
X
త‌మిళ హీరో ధ‌నుష్ విడాకులు ప్ర‌క‌టించిన త‌రువాత సినిమాల ప‌రంగా స్పీడు పెంచారు. వెంట‌నే తెలుగు, త‌మిళ భాష‌ల్లో బైలింగ్వ‌ల్ మూవీని ధ‌నుష్ ప్రారంభించిన విష‌యం తెలిసిందే. తెలుగులో `సార్‌` పేరుతో త‌మిళంలో `వాతీ` పేరుతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వెంకీ అట్లూరి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్ సినిమాస్ బ్యాన‌ర్స్ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ, త్రివిక్ర‌మ్ వైఫ్ సాయి సౌజ‌న్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవ‌లే ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లైంది.

ఇదిలా వుంటే ఇదే జోరుతో ధ‌నుష్ త‌మిళంలో `నానే వ‌రువేన్` పేరుతో మ‌రో చిత్రాన్ని మొద‌లుపెట్టారు. ఈ చిత్రానికి `7జి బృందావ‌న కాల‌నీ` ఫేమ్, ధ‌నుష్ సోద‌రుడు సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన తాజా షెడ్యూల్ కూడా మొద‌లైంది. ఈ సంద‌ర్భంగా మేక‌ర్స్ కొత్త పోస్ట‌ర్ ని రిలీజ్ చేశారు. ఇందులో ధ‌నుష్ డ‌బుల్ ట్రీట్ ఇవ్వ‌బోతున్నారు. ఈ చిత్రంలో ఆయ‌న ద్విపాత్రాభిన‌యం చేస్తున్న‌ట్టుగా మేక‌ర్స్ పోస్ట‌ర్ తో క్లారిటీ ఇచ్చేశారు.

ఓ పాత్ర‌లో యంగ్ గానూ మ‌రో పాత్ర‌లో మాసిన గ‌డ్డంతో గాగుల్స్ ధ‌రించి చాలా మెచ్చూర్డ్ లుక్ తో క‌నిపిస్తున్నారు. రెండు పాత్ర‌ల్లోనూ చాలా వేరియేష‌న్స్ క‌నిపిస్తూ ప్రాజెక్ట్ పై ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ సినిమాతో ధ‌నుష్ అభిమానుల‌కు డ‌బుల్ ట్రీట్ ఇవ్వ‌బోతున్నార‌ని కోలీవుడ్ వ‌ర్గాలు అంటున్నాయి.

ఇందుజ ర‌విచంద‌ర్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని వీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై క‌లైపులి ఎస్ . ధాను నిర్మిస్తున్నారు. యోగి బాబు స‌పోర్టింగ్ రోల్ లో న‌టిస్తున్న ఈ మూవీకి యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం అందిస్తున్నారు. సెల్వ‌రాఘ‌వ‌న్, ధ‌నుష్ ల క‌ల‌యిక‌లో ఇంత వ‌ర‌కు నాలుగు చిత్రాలొచ్చాయి.

కొంత విరామం త‌రువాత మ‌ళ్లీ ఈ ఇద్ద‌రు బ్ర‌ద‌ర్స్ క‌లిసి చేస్తున్న సినిమా కావ‌డంతో ఈ చిత్రంపై ప్రేక్ష‌కుల్లో మంచి క్రేజ్ ఏర్ప‌డింది. ఆ క్రేజ్ కి త‌గ్గ‌ట్టే ఈ మూవీని చాలా ప్ర‌త్యేక‌త‌ల‌తో సెల్వ‌రాఘ‌వ‌న్ తెర‌కెక్కిస్తున్నారు. స‌రికొత్త క‌థా క‌థ‌నాల‌తో రూపొందుతున్న ఈ మూవీకి ఓం ప్ర‌కాష్ ఛాయాగ్ర‌హ‌ణం అందిస్తున్నారు. దీని త‌రువాత మ‌రోసారి ధ‌నుష్ - సెల్వ‌రాఘ‌వ‌న్ క‌లిసి ఓ సీక్వెల్ ని చేయ‌బోతున్నారు.

కార్తీ హీరోగా న‌టించిన `యుగానికి ఒక్క‌డు` ఏ స్థాయిలో సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే. ఆ సినిమాకు ఇన్నేళ్ల త‌రువాత సెల్వ‌రాఘ‌వ‌న్ సీక్వెల్ చేయ‌బోతున్నారు. ఇప్ప‌టికే క‌థ సిద్ధం చేసిన సెల్వ‌రాఘ‌వ‌న్ ఈ మూవీని వ‌చ్చే ఏడాది సొంతం నిర్మాణంలో తెర‌కెక్కించాల‌ని ప్లాన్ చేస్తున్నారు