Begin typing your search above and press return to search.

జంట‌ను క‌లిపే ప్ర‌య‌త్నం ఫలించేట్టుంది!

By:  Tupaki Desk   |   28 Jan 2022 3:30 AM GMT
జంట‌ను క‌లిపే ప్ర‌య‌త్నం ఫలించేట్టుంది!
X
సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య త‌న భ‌ర్త ధ‌నుష్ నుండి విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత దేశం మొత్తం షాక్ లో ఉంది. పెళ్లయిన 18 ఏళ్ల తర్వాత ఈ స్టార్ కపుల్ విడిపోయారు. ఈ వార్త ధనుష్ - ఐశ్వర్య కుటుంబ సభ్యులకు అంతగా రుచించ‌లేదు. ధనుష్ తండ్రి కస్తూరి రాజా ఇలా విడిపోవడాన్ని కుటుంబ తగాదా అని అన్నారు. అన్ని ఇళ్ల‌లో జ‌రిగేదేన‌ని వారు మళ్లీ కలుస్తారని అతను చాలా నమ్మకంగా ఉన్నాడు.

తాజా స‌మాచారం మేర‌కు.. సూపర్ స్టార్ రజనీకాంత్ తన కుమార్తె విడాకుల వార్తలతో పూర్తిగా క‌ల‌త‌లో ఉన్నారు. రజనీకాంత్ తన కూతురు ధనుష్ తో ఉన్న సమస్యను పరిష్కరించి త్వరగా కలపాలని కోరుకుంటున్నారు. ధనుష్- ఐశ్వర్యలతో ఫోన్ లో మాట్లాడి తన అభిప్రాయాలను వెల్లడించినట్లు సమాచారం. ఈ జంట ఇంకా అధికారికంగా విడాకులు తీసుకోలేదని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం రజనీకాంత్ వారి బంధాన్ని సరిదిద్దుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

ధనుష్- ఐశ్వర్య ఇద్దరూ ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ `సర్` సినిమా షూటింగ్ ప్రారంభించాడు. ఈ ద్విభాషా చిత్రం ఈ సంవత్సరం విడుదల కానుంది. ఐశ్వ‌ర్య ఓ సాంగ్ చిత్రీక‌ర‌ణ కోసం హైదరాబాద్ లోనే ఉన్నారు.