Begin typing your search above and press return to search.

సౌందర్య ఏం చేసిందో ఇవాళ తెలుస్తుంది

By:  Tupaki Desk   |   7 Jun 2017 10:10 AM IST
సౌందర్య ఏం చేసిందో ఇవాళ తెలుస్తుంది
X
సౌందర్యా రజినీకాంత్.. ఈ పేరు చెప్పగానే చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ తో పాటు.. సినీ అభిమానుల గుండెళ్లో రైళ్లు పరిగెట్టడం ఖాయం. రోబో సక్సెస్ అయిన తర్వాత.. తండ్రి రజినీకాంత్ తో కొచ్చాడయాన్ మూవీ స్టార్ట్ చేసింది. పదేళ్లకు పైగా గ్రాఫిక్ డిజైనింగ్ లో ఉన్న అనుభవంతో.. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో దేశంలో తొలిసారిగా ఈ మూవీని తన దర్శకత్వంలోనే తెరకెక్కించింది సౌందర్య. కొచ్చాడయాన్(తెలుగులో విక్రమసింహ) రిజల్ట్ చెప్పాల్సిన పని లేదు.

ఆ తర్వాత మళ్లీ రెండేళ్లకు పైగా గ్యాప్ తీసుకుని ఇప్పుడో మూవీని డైరెక్ట్ చేస్తోంది. ఇది వేలయిళ్ల పట్టాదారి2(వీఐపీ2) కావడమే అసలైన విషయం. ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న ధనుష్ తో సినిమా చేస్తుండడం.. అదికూడా వీఐపీ(తెలుగులో రఘువరన్ బీటెక్) లాంటి సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ కావడంతో.. ఆసక్తి బాగానే ఉంది. పైగా లీడ్ రోల్ లోకి బాలీవుడ్ బ్యూటీ కాజోల్ ను తీసుకోవడంతో.. ఈ ఇంట్రెస్ట్ రెట్టింపయిందని చెప్పాలి. ఈ మూవీ కథ-మాటలను ధనుష్ స్వయంగానే అందించేశాడు.

ఇవాళ సాయంత్రం 4 గంటలకు వీఐపీ2 టీజర్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని దర్శక నిర్మాతలు అఫీషియల్ గానే అనౌన్స్ చేశారు. తండ్రితో కొచ్చాడయాన్ తో అందరినీ భయపెట్టేసిన సౌందర్య.. ఇప్పుడు సోదరి భర్త అయిన ధనుష్ తో ఎలాంటి సినిమా తీసిందనే ఆసక్తి మాత్రం కోలీవుడ్ జనాల్లో కనిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/