Begin typing your search above and press return to search.
రాక్ స్టార్ కి అవార్డ్ ఇచ్చిన పవర్ స్టార్
By: Tupaki Desk | 28 July 2016 12:47 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అవార్డు ఫంక్షన్ కి హాజరవడం చాలా ఆశ్చర్యం కలిగించింది. నిన్న హైద్రాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో పవన్ సడెన్ గా దర్శనమిచ్చాడు. ఎప్పుడూ లేనిది ఇదేం వింత అనుకున్నారంతే. అయితే.. తనకు ఎంతో ఇష్టమైన రాక్ స్టార్ డీఎస్పీ కోసమే పవన్ ఈ ఫంక్షన్ కు వచ్చాడని తెలుస్తోంది.
మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ ఫంక్షన్ కు చాలామంది సినీ ఆర్టిస్టులు టెక్నీషియన్స్ తో పాటు పవన్ కూడా అటెండ్ అయ్యాడు. ఇంతకీ ఈ ఈవెంట్ కి పవన్ హాజరవడానికి కారణం ఏంటంటే.. డీఎస్పీకి అవార్డ్ ఇచ్చేందుకే. పవర్ స్టార్ కి రాక్ స్టార్ కి మధ్య ఉన్న ర్యాపో అందరికీ తెలిసిందే. తన చేతుల మీదుగా రాక్ స్టార్ కు అవార్డు అందించే సిట్యుయేషన్ కోసమే పవన్ ఈ ఈవెంట్ కి వచ్చినట్లు తెలుస్తోంది. పవన్ చేతుల మీదుగా అవార్డ్ అందుకోవడంతో పాటు.. తనకొచ్చిన అవార్డలను చూపిస్తున్న ఫోటోలను.. డీఎస్పీ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.
'ఈ అవార్డులు ఇచ్చినందుకు రేడియో మిర్చికి థ్యాంక్యూ. నా సింగర్స్ - టీమ్ - మ్యుజీషియన్స్ అందరికీ థ్యాంక్స్. నా సంగీతాన్ని ప్రేమించే అందరికీ థ్యాంక్స్' అంటూ ట్వీట్ చేశాడు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్.
మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ ఫంక్షన్ కు చాలామంది సినీ ఆర్టిస్టులు టెక్నీషియన్స్ తో పాటు పవన్ కూడా అటెండ్ అయ్యాడు. ఇంతకీ ఈ ఈవెంట్ కి పవన్ హాజరవడానికి కారణం ఏంటంటే.. డీఎస్పీకి అవార్డ్ ఇచ్చేందుకే. పవర్ స్టార్ కి రాక్ స్టార్ కి మధ్య ఉన్న ర్యాపో అందరికీ తెలిసిందే. తన చేతుల మీదుగా రాక్ స్టార్ కు అవార్డు అందించే సిట్యుయేషన్ కోసమే పవన్ ఈ ఈవెంట్ కి వచ్చినట్లు తెలుస్తోంది. పవన్ చేతుల మీదుగా అవార్డ్ అందుకోవడంతో పాటు.. తనకొచ్చిన అవార్డలను చూపిస్తున్న ఫోటోలను.. డీఎస్పీ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.
'ఈ అవార్డులు ఇచ్చినందుకు రేడియో మిర్చికి థ్యాంక్యూ. నా సింగర్స్ - టీమ్ - మ్యుజీషియన్స్ అందరికీ థ్యాంక్స్. నా సంగీతాన్ని ప్రేమించే అందరికీ థ్యాంక్స్' అంటూ ట్వీట్ చేశాడు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్.
