Begin typing your search above and press return to search.

దేవిశ్రీ.. థమన్‌ ల మద్య ఏమీ లేదు.. ఇదే క్లారిటీ

By:  Tupaki Desk   |   10 Aug 2021 10:30 AM GMT
దేవిశ్రీ.. థమన్‌ ల మద్య ఏమీ లేదు.. ఇదే క్లారిటీ
X
సినిమా ఇండస్ట్రీలో పోటీ అనేది చాలా సహజం. కొందరు మంచి వాతావరణంలో పోటీ పడుతూ ఉంటారు. కాని కొందరు మాత్రం మనసులో అసూయ పెంచుకుని తనకు పోటీ అనుకున్న వారిపై ఆగ్రహంతో ఉంటారు. హీరోలు.. దర్శకులు.. హీరోయిన్స్‌ అన్ని విభాగాల వారిలో కూడా విభేదాలు.. పోటీ.. అసూయ లు ఉంటాయి అనడంలో సందేహం లేదు. దేవిశ్రీ ప్రసాద్‌ మరియు థమన్‌ ల మద్య కూడా అసూయ మరియు పోటీ ఉంటుంది అనేది చాలా మంది కామెంట్స్ ఇద్దరి మద్య ఉంది ఏంటో కాని అభిమానులు మాత్రం వారి మద్య మరింతగా వైరం పెంచేలా సోషల్‌ మీడియాలో కామెంట్స్ చేయడం.. ట్రోల్స్ చేయడం వంటివి చేస్తున్నారు. ఒకరి రికార్డుల గురించి మరొకరు తప్పుగా.. తక్కువ చేసి మాట్లాడటం వంటివి చేస్తున్నారు. గత ఏడాది థమన్‌ అల వైకుంఠపురంలో మరియు దేవిశ్రీ సరిలేరు నీకెవ్వరు సినిమాలతో ఒకేసారి వచ్చిన సమయంలో అభిమానుల మద్య చిన్నపాటి యుద్దమే సోషల్‌ మీడియాలో జరిగింది.

అభిమానులు అంత గొడవ పడుతున్నా కూడా దేవిశ్రీ ప్రసాద్‌ మరియు థమన్ ల మద్య మంచి స్నేహం ఉందని గతంలో పలు సందర్బాల్లో నిరూపితం అయ్యింది. తాజాగా మళ్లీ కూడా దేవిశ్రీ ప్రసాద్ చేసిన వ్యఖ్యలతో ఇద్దరి మద్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అంటూ క్లారిటీ వచ్చింది. మహేష్‌బాబు పుట్టిన రోజు సందర్బంగా సర్కారు వారి పాట టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్‌ కు థమన్ ఇచ్చిన బ్యాక్ డ్రాప్‌ స్కోర్ అదిరి పోయిందనే కామెంట్స్ వస్తున్నాయి. అభిమానులు ట్విట్టర్ లో ఏర్పాటు చేసిన స్పేస్ సెషన్‌ లో దేవి శ్రీ ప్రసాద్‌ మాట్లాడాడు. తనకు ఇష్టమైన హీరో మహేష్‌ బాబు అంటూ చెప్తూనే సర్కారు వారి పాట సినిమా టీజర్ పై స్పందించాడు.

మామూలుగా అయితే టీజర్ లో మహేష్‌ బాబు నటన బాగుంది.. దర్శకత్వం బాగుంది.. అంటూ ఏదో ఒకటి చెప్పేసి ముగించవచ్చు. కాని దేవిశ్రీ ప్రసాద్‌ స్వయంగా టీజర్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్ గురించి ప్రస్థావించాడు. నాకు  టీజర్‌ స్కోర్ బాగా నచ్చింది. అభినందనలు థమన్‌.. నువ్వు ఇలా రాక్ చేయాలి బ్రదర్‌ అంటూ పేర్కొన్నాడు. ట్విట్టర్ లో సర్కారు వారి పాట గురించి దేవిశ్రీ ప్రసాద్‌ స్పందించక పోవడంతో ఇద్దరి మద్య ఉన్న వ్యవహారం పై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కాని సాయంత్రం సమయంలో దేవిశ్రీ అభిమానుల స్పేస్‌ షెషన్ లో మాట్లాడుతూ థమన్ కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మాట్లాడటం జరిగింది. అభిమానులు ఇప్పటి నుండి అయినా గొడవ పడకుండా ఉంటే మంచిది. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్ప సినిమా కోసం దేవి శ్రీ ప్రసాద్‌ వర్క్ చేస్తున్నాడు. త్వరలో సినిమా నుండి మొదటి పాట రాబోతుంది. ఆ పాటకు థమన్‌ కూడా స్పందిస్తూ గొడవ అస్సలు లేదు.. ఇద్దరు మంచి స్నేహితులు అని అభిమానులకు మరింత క్లారిటీ వస్తుందని ఇండస్ట్రీ వర్గాల వారు ఆశిస్తున్నారు.