Begin typing your search above and press return to search.

వాళ్లసలు మనుషులే కాదు..తనూపై మరో కేసు

By:  Tupaki Desk   |   9 Oct 2018 8:13 AM GMT
వాళ్లసలు మనుషులే కాదు..తనూపై మరో కేసు
X
బాలీవుడ్‌ లో తనూశ్రీ దత్తా వ్యవహారం ముదిరి పాకాన పడ్డట్లయ్యింది. నానా పటేకర్‌ తో మొదలు పెట్టిన తనూశ్రీ దత్తా పలువురు బాలీవుడ్‌ స్టార్స్‌ ను టార్గెట్‌ గా చేసుకుని విమర్శలు చేస్తోంది. తనను లైంగికంగా వేదించిన వారు - ఆడవారి పట్ల అమానుషంగా ప్రవర్తించే వారు అసలు మనుషులే కాదని, వారి పట్ల కఠినంగా వ్యవహరించాలంటూ తనూశ్రీ దత్తా ప్రకటించింది. మన దేశంలో కూడా మీటూ ఉద్యమంను ఉదృతంగా ముందుకు తీసుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తనూశ్రీ దత్తా ప్రకటించింది.

పది సంవత్సరాల క్రితం ‘హార్న్‌ ఓకే ప్లీజ్‌’ చిత్రం షూటింగ్‌ సమయంలో తనపై లైంగిక దాడి చేసిన నానా పటేకర్‌ పై ఇప్పుడు ఆరోపణలు చేస్తున్న తనూశ్రీ దత్తాపై కొందరు విమర్శలు చేస్తుంటే మరి కొందరు మాత్రం మద్దతుగా నిలుస్తున్నారు. తనూశ్రీ దత్తా చేస్తున్న ఆరోపణలు నిజం కాదంటూ - ఆమెపై నానా పటేకర్‌ మరియు వివేక్‌ అగ్నిహోత్రిలు పరువు నష్టం కేసులు నమోదు చేయడం జరిగింది. తాజాగా తనపై దాడి చేసిన వారు మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అంటూ తనూశ్రీ ఆరోపిస్తున్న విషయం తెల్సిందే.

తమకు సంబంధం లేని విషయంలో తమను లాగినందుకు గాను మహారాష్ట్ర పోలీసులకు ఎంఎన్‌ ఎస్‌ ఫిర్యాదు చేయడం జరిగింది. తమ సంస్థ ప్రతిష్టకు భంగం వాటిల్లేలా ఆమె వ్యాఖ్యలు ఉన్న కారణంగా వెంటనే ఆమెపై కేసు నమోదు చేయాలంటే వారు డిమాండ్‌ చేస్తున్నారు. పరువు నష్టం దావాను కూడా వేయడం జరిగింది. మరోవైపు తనూశ్రీ దత్తా కూడా ఇప్పటికే పోలీసులకు నానా పటేకర్‌ తో పాటు పలువురిపై కంప్లైంట్‌ ఇచ్చిన విషయం తెల్సిందే. మొత్తానికి తనూశ్రీ దత్తా విషయంలో రోజుకో అప్‌ డేట్‌ ఉంటుంది. మీడియాలో ఈ విషయమై పతాక స్థాయిలో వార్తలు వస్తూనే ఉన్నాయి.