Begin typing your search above and press return to search.

'ఆడవాళ్లు మీకు జోహార్లు' టీజర్ అప్‌డేట్‌

By:  Tupaki Desk   |   7 Feb 2022 3:40 PM GMT
ఆడవాళ్లు మీకు జోహార్లు టీజర్ అప్‌డేట్‌
X
శర్వానంద్‌ మరియు రష్మిక మందన్నా జంటగా తెరకెక్కిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. విడుదల విషయంలో కాస్త గందరగోళం నడుస్తోంది. ఫిబ్రవరి 25న భీమ్లా నాయక్ సినిమా వస్తే విడుదల వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయి అంటూ ప్రచారం జరుగుతోంది. కాని చిత్ర యూనిట్‌ సభ్యులు మాత్రం ప్రమోషన్‌ చేస్తూ వెళ్తున్నారు. ప్రమోషన్ లో భాగంగా ఈనెల 10న సినిమా టీజర్ ను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. శర్వానంద్‌ మరియు రష్మికల లుక్‌ విడుదల తర్వాత సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి. దాంతో చిత్ర యూనిట్‌ సభ్యులు రెట్టించిన ఉత్సాహంతో సినిమా ప్రమోషన్ చేస్తున్నారు.

ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్‌ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే మంచి నేపథ్యంతో శర్వ మరియు రష్మికలతో దర్శకుడు తిరుమల కిషోర్ ఈ సినిమాను తెరకెక్కించాడని తెలుస్తోంది. శర్వానంద్‌ మరియు రష్మికల జోడీ బాగుందంటూ ఇప్పటికే విడుదల అయిన ఫస్ట్‌ లుక్ కు సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ వస్తున్నాయి. చీర కట్టులో రష్మిక ను ఈ సినిమాలో చూస్తుంటే మళ్లీ గీత గోవిందం రోజులు గుర్తుకు వస్తున్నాయంటూ రష్మిక అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా శర్వా లుక్ కూడా గతంలో మాదిరిగా నాచురల్‌ గా ఉంది. ఈ సినిమా పై ఉన్న అంచనాలు పెంచే విధంగా ఈనెల 10 న రాబోతున్న టీజర్‌ ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.

పుష్ప సినిమా లో శ్రీవల్లి గా నటించిన రష్మిక మందన్నా ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కించుకున్న ఈ అమ్మడు శర్వా కు సరి జోడి గా ఉందని ఇప్పటికే నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా సక్సెస్‌ అయ్యి రష్మిక మరియు శర్వాల కాంబోలో మరిన్ని సినిమాలు రావాలని అభిమానులు ఆశ పడుతున్నారు. శర్వానంద్‌ గత చిత్రాల ఫలితాలు నిరాశ పర్చినా దర్శకుడు కిషోర్ తిరుమల మంచి ట్రాక్‌ రికార్డును కలిగి ఉన్నాడు. కనుక ఈ సినిమా తప్పకుండా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఈ క్రేజీ కాంబో మూవీ తో శర్వాకు మునుపటి రోజులు వస్తాయా అనేది చూడాలి.