Begin typing your search above and press return to search.

మెగాస్టార్ చిరంజీవి పేరు ఎందుకు వచ్చిందో తెలియదు : దాసరి అరుణ్

By:  Tupaki Desk   |   27 Jun 2020 11:10 AM GMT
మెగాస్టార్ చిరంజీవి పేరు ఎందుకు వచ్చిందో తెలియదు : దాసరి అరుణ్
X
తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా రచయితగా నటుడిగా మల్టీటాలెంటెడ్ అయిన దర్శకరత్న దివంగత దాసరి నారాయణరావు తిరుగులేని శక్తి స్వరూపంలా ఎదిగారు. ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరించి టాలీవుడ్ మొత్తాన్ని ఏకతాటిపై నడిపించారు. దాసరి దగ్గరకు వెళ్లకుండా ఇండస్ట్రీలో ఏ పని జరగదు.. ఏ సమస్యా పరిష్కారమవ్వదు అనే స్థాయికి చేరిపోయారు. అయితే ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా వ్యవహరించి అందరి సమష్యలకు పరిష్కారాన్ని చూపించే దాసరి నారాయణ రావు ఇంటి సమస్య మాత్రం తీరడం లేదు. గత కొంతకాలంగా ఇద్దరు అన్నాదమ్ముల మధ్య తలెత్తిన ఆస్తి తగాదాలు ఇప్పుడు తారాస్థాయికి చేరుకున్నాయి. నిన్నటి నుండి దాసరి ఇద్దరి తనయుల మధ్య నెలకొన్న ఆస్తి వివాదం టాలీవుడ్‌ లో హాట్ టాపిక్‌ గా మారింది.

దాసరి పెద్ద కొడుకు ప్రభు.. తన తమ్ముడు అరుణ్‌ తన ఇంటి గేటు దూకి లోపలికి వచ్చి తనపై తన కుటుంబసభ్యులపై దాడి చేశారని జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. సినీ ఇండస్ట్రీ పెద్దలు సి. కళ్యాణ్‌ - మురళీ మోహన్‌ - మోహన్‌ బాబు వంటి వారు ఈ విషయంలో జోక్యం చేసుకొని ఈ వివాదాన్ని పరిష్కరించాలని ప్రభు విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా తన తమ్ముడు నుంచి ప్రాణహాని ఉందని పోలీసులే రక్షణ కల్పించాలని కోరారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం టాలీవుడ్ పెద్దగా అన్నీ ముందుండి నడిపిస్తున్న మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగి దాసరి తనయుల మధ్య నెలకొని ఉన్న వివాదాన్ని పరిష్కరిస్తున్నాడని.. మీడియాలో ఈ న్యూస్ చూసిన చిరంజీవి ప్రభు - అరుణ్ కుమార్ లకు కాల్ చేసి కూర్చొని మాట్లాడుకొని సమస్యకి పరిష్కారం ఆలోచిద్దాం అని చెప్పాడని వార్తలు వచ్చాయి.

కాగా ఈరోజు దాసరి అరుణ్ కుమార్ మీడియా ముందుకు వచ్చి వారి మధ్య మొదలైన వివాదానికి గల కారణాలను వివరించారు. తన అన్న ప్రభు చేసినవన్నీ తప్పుడు ఆరోపణలే అని.. మా మధ్య ప్రతీ ఇంట్లోనూ సహజంగా ఉండే ఆస్తి గొడవలు తప్ప వేరే ఏమీ లేవని వెల్లడించారు. అంతేకాకుండా ఈ వివాదంలోకి మెగాస్టార్ చిరంజీవి పేరు ఎందుకు వచ్చిందో తనకు తెలియదని అన్నారు. అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. ''మెగాస్టార్ చిరంజీవిగారికి ఈ విషయానికి ఎటువంటి సంబంధం లేదు. అసలు ఆయన పేరు ఎందుకు వచ్చిందో కూడా నాకు తెలియదు. అనవసరంగా ఆయనను ఇందులోకి లాగుతున్నారు'' అని తెలిపారు. ఈ విషయమై టాలీవుడ్ పెద్దలు జోక్యం చేసుకుంటే తనకెలాంటి అభ్యంతరం లేదన్నాడు. ప్రభు ఒప్పుకుంటే కూర్చొని సమస్యను పరిష్కరించుకోడానికి సిద్ధంగా ఉన్నానని.. అనవసరంగా ప్రభు ఇండస్ట్రీ పెద్దలు పట్టించుకోవడం లేదని వారిపై ఆరోపణలు చేయడం తగదు.. నిన్న సి. కళ్యాణ్ ఫోన్ చేసి వివరాలు తెలుసుకొని నేను మాట్లాడతాలే అన్నారని చెప్పుకొచ్చారు.