Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని వ‌ద‌ల‌ని సైబ‌ర్ క్రైమ్

By:  Tupaki Desk   |   4 Jun 2020 4:30 AM GMT
ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని వ‌ద‌ల‌ని సైబ‌ర్ క్రైమ్
X
ఎన్టీఆర్ ఫ్యాన్స్ వ‌ర్సెస్ మీరా చోప్రా ఎపిసోడ్స్ గురించి తెలిసిందే. ఎన్టీఆర్ ఎవ‌రో త‌న‌కు తెలీద‌ని సోష‌ల్ మీడియాల్లో వ్యాఖ్యానించిన న‌టి మీరా చోప్రాపై ఫ్యాన్స్ వీరంగా పీక్స్ కి చేరుకుంది. ``సామూహిక అత్యాచారం చేస్తామ‌ని.. యాసిడ్ దాడులు చేసి చంపేస్తామ``‌ని హెచ్చ‌రించిన వైనం సంచ‌ల‌న‌మైంది. అందుకు సంబంధించిన సోష‌ల్ మీడియా స్క్రీన్ షాట్ల‌తో మీరా చోప్రా నేరుగా సైబ‌రాబాద్ పోలీసుల్ని.. జాతీయ మ‌హిళా క‌మీష‌న్ ని ఆశ్ర‌యించింది. దీంతో ఎన్టీఆర్ అభిమానులపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ట్విట్ట‌ర్ ఫిర్యాదును స్వీకరించి ద‌ర్యాప్తును సాగిస్తున్నారు.

ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 506 (క్రిమినల్ బెదిరింపు).. 509 (ఒక మహిళను అవమానించడం) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 67 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్ర‌స్తుతం నిందితులను గుర్తించే ప్రక్రియ సాగుతోంది. అలాగే ఈ బెదిరింపుల వ్య‌వ‌హారంపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సిడబ్ల్యు) ఇన్వాల్వ్ అయ్యింది. కమిషన్ చైర్ ‌పర్సన్ రేఖ శర్మ నేరుగా తెలంగాణ పోలీసులను వెంట‌నే ద‌ర్యాప్తు చేసి చర్య తీసుకోవాలని కోరారు. ప్ర‌స్తుతం తార‌క్ ఫ్యాన్స్ పై ఎఫ్‌.ఐ.ఆర్ న‌మోదు చేసి పోలీసులు కేసును ద‌ర్యాప్తు చేస్తున్నారు.

వేశ్య.. పో*‌స్టార్.. బి* అంటూ అస‌భ్య‌క‌ర ప‌ద‌జాలం ఉప‌యోగించ‌డ‌మే గాక‌.. చంపేస్తామ‌ని బెదిరించ‌డంతో ఈ కేసు న‌మోదు చేసిన‌ట్టు పోలీసులు చెబుతున్నారు. అయితే దీనిపై ఇప్ప‌టివ‌ర‌కూ తార‌క్ స్పందించ‌లేదు. అభిమానం హ‌ద్దు మీరితే ఇలా లేనిపోని త‌ల‌నొప్పుల్ని తెచ్చుకోవాల్సి ఉంటుంద‌ని ఇప్ప‌టికే ప‌లుమార్లు స్టార్ల విష‌యంలో ప్రూవ్ అయ్యింది. ఇక‌నైనా స్టార్లు త‌గు జాగ్ర‌‌త్త‌లు తీసుకుంటే బావుంటుందేమో!