Begin typing your search above and press return to search.

'రాంచరణ్ 15' పై క్రేజీ న్యూస్..!

By:  Tupaki Desk   |   30 April 2021 6:32 AM GMT
రాంచరణ్ 15 పై క్రేజీ న్యూస్..!
X
మెగాపవర్ స్టార్ రాంచరణ్ - స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా పై రోజురోజుకి అంచనాలతో పాటుగా రూమర్స్ కూడా బాగానే పుట్టుకొస్తున్నాయి. రాంచరణ్ కెరీర్లో శంకర్ దర్శకత్వం వహించనున్న సినిమా 15వది. వినయవిధేయరామ సినిమా తర్వాత ఎంతో పక్కడ్బంధీగా సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నాడు రాంచరణ్. ఓవైపు దర్శకధీరుడు రాజమౌళితో ఆర్ఆర్ఆర్ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఆ సినిమా ఇప్పుడు చివరిదశలో ఉంది. ఆర్ఆర్ఆర్ పూర్తి కాగానే రాంచరణ్ శంకర్ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు. ఈ సినిమాల లైన్ బట్టే చరణ్ ఎంత జాగ్రత్తగా కెరీర్ బిల్డ్ చేసుకుంటున్నాడో అర్ధమవుతుంది.

ఇదిలా ఉండగా.. శంకర్ తో సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి సినిమా పై ఊహగానాలు ఓ రేంజిలో వ్యక్తం అవుతూనే ఉన్నాయి. అందులో ఒకటి హీరోయిన్ విషయం. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమా కాబట్టి ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ ఇంపార్టెంట్ అయ్యుంటుందని ఎక్సపెక్ట్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాలో రాంచరణ్ సరసన కొరియన్ హీరోయిన్ 'బేసుజి'ని ఎంపిక చేసారని వార్తలొచ్చాయి. కానీ ఆ వార్తల్లో నిజం లేదని అనిపిస్తుంది. ఎందుకంటే రాంచరణ్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ హీరోయిన్లను పరిశీలిస్తున్నారు శంకర్ బృందం. ఈ లెక్కన ఎక్కువగా కియారా అద్వానీ పేరు వినిపిస్తుంది. మరి ఈ పాన్ ఇండియా మూవీలో కొరియన్ హీరోయిన్ లేదనే విషయం క్లారిటీ వచ్చినట్లే అంటూ నేటిజన్లు భావిస్తున్నారు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నాడు.