Begin typing your search above and press return to search.

దృశ్యం-2 లో క్రేజీ ఛేంజెస్..!

By:  Tupaki Desk   |   28 Jun 2021 8:30 AM GMT
దృశ్యం-2 లో క్రేజీ ఛేంజెస్..!
X
‘దృశ్యం’ సినిమా చూడని సినిమా లవర్స్ బహుశా ఎవ‌రూ ఉండ‌క‌పోవ‌చ్చు. సాధార‌ణ క‌థ‌ను అద్భుత‌మైన క‌థ‌నంతో, క‌ట్టిప‌డేసే స్క్రీన్ ప్లేతో న‌డిపించిన జీతూ జోసెఫ్.. రిలీజ్ చేసిన ప్ర‌తిభాష‌లోనూ ప్ర‌శంస‌లు అందుకున్నారు. మ‌ల‌యాళంలో పుట్టిన ఈ క‌థ ప్ర‌పంచం మొత్తానికీ న‌చ్చింది.

ఈ మ‌ధ్య‌నే దృశ్యం-2 కూడా రిలీజ్ చేశాడు ద‌ర్శ‌కుడు. సీక్వెల్ లోనూ మోహ‌న్ లాల్, మీనా అద‌ర‌గొట్టారు. స‌హ‌జంగా సీక్వెల్ అన‌గానే.. మొద‌టి పార్ట్ ప్ర‌భావం ఉంటుంది. అంతేకాదు.. ఫ‌స్ట్ మూవీ అంత హిట్ కూడా కాదు అనే ఒక న‌మ్మ‌కం కూడా ప్రేక్ష‌కుల్లో స్థిర‌ప‌డిపోయింది. కానీ.. దాన్ని తుడిచిపెట్టింది దృశ్యం-2.

మొదటి భాగానికి ఏ మాత్రం త‌గ్గ‌కుండా.. ఇంకా చెప్పాలంటే ఓ మెట్టుపైన్నే సీక్వెల్ ను ఉంచాడు ద‌ర్శ‌కుడు. క‌రోనా నేప‌థ్యంలో థియేట‌ర్లు మూత‌ప‌డ‌డంతో.. ఆ మ‌ధ్యనే అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేశారు. ఓటీటీలో విడుద‌ల చేసినా.. అద్దిరిపోయే రెస్పాన్స్ అందుకుంది దృశ్యం-2. దీంతో.. సీక్వెల్ కూడా అంద‌రి దృష్టినీ ఆక‌ట్టుకుంది.

దీంతో తెలుగు హ‌క్కుల‌ను తీసుకోవ‌డం.. రీమేక్ ప‌ట్టాలెక్కించ‌డం.. పూర్తిచేయ‌డం కూడా అయిపోయింది. క‌రోనా గోల లేకుంటే.. ఇప్ప‌టికే సినిమా రిలీజ్ కూడా అయ్యేదే. అయితే.. ఈ చిత్రానికి సంబంధించి త‌మిళ‌నాట మేజ‌ర్ ఛేంజ్ చేయాల్సి వ‌స్తోంద‌ట‌.

త‌మిళ‌నాట కూడా సేమ్ కాంబోను రిపీట్ చేయాల‌ని భావించారు మేక‌ర్స్‌. ‘పాపనాశం’ పేరుతో తెరకెక్కిన ఫస్ట్ పార్ట్ లో కమల్ హాసన్ - గౌత‌మీ న‌టించారు. వ్య‌క్తిగ‌త జీవితంలోనూ పార్ట‌న‌ర్స్ గా ఉన్న‌వీరిజంట‌.. ఈ సినిమా ద్వారా ప్రేక్ష‌కుల‌ను అమితంగా ఆక‌ట్టుకుంది. అయితే.. సీక్వెల్ లో వీరు క‌లిసి న‌టించే ఛాన్స్ లేక‌పోయింది. వ్య‌క్తిగ‌తంగా వీరిద్ద‌రూ విడిపోయిన సంగ‌తి తెలిసిందే. దీంతో.. ఆ పాత్ర‌కు న‌దియాను తీసుకోవాల‌ని చూస్తున్నార‌ట‌.

తెలుగు మొద‌టి పార్టులో న‌దియా కీల‌క‌మైన పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆమె కుమారుడి హ‌త్య చుట్టూనే క‌థ తిరుగుతుంది. ఈ న‌దియానే క‌మ‌ల్ స‌ర‌స‌న తీసుకోవాల‌ని భావిస్తున్నాడట‌ ద‌ర్శ‌కుడు. మ‌రి, ఈ క్రేజీ కాంబో ప్రేక్ష‌కుల‌ను ఎలా అల‌రిస్తుందో చూడాలి.