Begin typing your search above and press return to search.

'SSMB28' ప్రాజెక్ట్ పై క్రేజీ బజ్..!

By:  Tupaki Desk   |   25 May 2021 8:30 AM GMT
SSMB28 ప్రాజెక్ట్ పై క్రేజీ బజ్..!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ కు వుండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరి కలయికలో వచ్చిన 'అతడు' 'ఖలేజా' సినిమాలు క్లాసిక్స్ నిలిచిపోయాయి. ఈ క్రమంలో 11 ఏళ్ల తర్వాత క్రేజీ కాంబోలో హ్యాట్రిక్ మూవీకి అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. మహేష్ కెరీర్ లో 28వ చిత్రాన్ని త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తుండటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే '#SSMB28' ప్రాజెక్ట్ గురించి డైలీ ఏదొక వార్త వస్తూనే ఉంది. లేటెస్టుగా మరో క్రేజీ బజ్ ఈ సినిమాపై వినిపిస్తోంది.

అదేంటంటే 'SSMB28' చిత్రాన్ని పాన్ ఇండియన్ స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ, టాక్ అయితే నడుస్తోంది. నిజానికి టాలీవుడ్ స్టార్ హీరోలందరూ ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా మూవీస్ తో బిజీగా ఉన్నారు. అయితే ఒక్క మహేష్ మాత్రం ఇంకా ఆ దిశగా అడుగులు వేయలేదు. రాజమౌళి తో చేయబోయే సినిమాతో ఆ కోరిక కూడా తీరుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే దాని కంటే ముందే త్రివిక్రమ్ సినిమాతో మహేష్ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేయనున్నారని టాక్ వస్తోంది. ఇందులో నిజమెంతో క్లారిటీ రావాల్సి ఉంది.

ఇకపోతే 'SSMB28' ఒక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అని మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. లేటెస్టుగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మాట్లాడుతూ.. ఇది త్రివిక్రమ్ తరహాలో డిఫరెంట్ డైమెన్షన్స్ లో ఉంటుందని.. 'అతడు'ని మించి హిట్ అవుతుందని తెలిపారు. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ప‌తాకంపై రాధాకృష్ణ‌(చిన‌బాబు) నిర్మించనున్నారు. కృష్ణ పుట్టిన‌రోజైన మే 31న ఈ సినిమాని పూజా కార్య‌క్ర‌మాల‌తో లాంఛనంగా ప్రారంభించే అవకాశం ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2022 స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌ గా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.