Begin typing your search above and press return to search.

హీరోయిన్‌ చెక్‌ బౌన్స్ కేసు ఏమైంది?

By:  Tupaki Desk   |   22 March 2016 9:37 AM GMT
హీరోయిన్‌ చెక్‌ బౌన్స్ కేసు ఏమైంది?
X
బాలీవుడ్ నటి ప్రీతి జింటాపై 2013లో చెక్ బౌన్స్ కేసు నమోదైంది. అబ్బాస్ టైర్ వాలా అనే స్క్రిప్ట్ రైటర్ ఈ కేసు వేశాడు. ఇష్క్ ఇన్ పారిస్ చిత్రానికి సంబంధించి 8 లైన్ల వాయిస్ ఓవర్ రాసి ఇచ్చేందుకు గాను చెక్ ను ఇవ్వడం జరిగింది. నిర్ణీత సమయంలోనే ఈ స్క్రిప్ట్ ఇవాల్సి ఉండగా.. వర్క్ డెలివరీ ఇచ్చాక చెక్కును క్యాష్ చేసుకోవచ్చు.

ఆ తర్వాత ఈ చెక్కును డిపాజిట్ చేయగా.. బౌన్స్ అయ్యి వెనక్కొచ్చింది. బ్యాంకులో చెక్ స్టాప్ ఆర్డర్ ఇచ్చి ఉండడమే దీనికి ప్రధాన కారణం. దీంతో అబ్బాస్ టైర్ వాలా కోర్టుకెక్కాడు. అయితే.. కాంట్రాక్ట్ ప్రకారం సరైన సమయానికి వర్క్ కంప్లీట్ చేసి ఇవ్వలేదని, అతను చెక్కును ఎన్ క్యాష్ చేసుకోకుండా ఉండేందుకే ఇలా స్టాప్ చెక్ ఆర్డర్స్ ఇచ్చామని ప్రీతి వర్గాలు అంటున్నాయి.

అలాగే ఈ చెక్కు విషయంలో క్యాష్ చేసుకునే ముందు.. తమ క్లయింట్ ప్రీతి జింటాకు చెప్పి డిపాజిట్ చేయాల్సి ఉంటుందనే నిబంధనను కూడా అబ్బాస్ టైర్ వాలా ఉల్లంఘించాడని కోర్టుకు చెప్పారు లాయర్లు. ముందస్తు సమాచారం ఇవ్వకుండానే చెక్ డిపాజిట్ చేయడం తప్పు అన్న ప్రీతి లాయర్ల వాదనతో.. కోర్టు ఏకీభవించింది. ఈ కేసునుంచి ప్రీతి జింటాను తప్పిస్తున్నట్లు తెలిపింది.