Begin typing your search above and press return to search.

రవితేజ 'ఖిలాడీ' డైరక్టర్ కి కరోనా

By:  Tupaki Desk   |   20 April 2021 2:20 AM GMT
రవితేజ  ఖిలాడీ డైరక్టర్ కి కరోనా
X
మన దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ తీవ్ర రూపం దాలుస్తోన్న సంగతి తెలిసిందే. గ‌త నెల రోజులుగా దేశ‌వ్యాప్తంగా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకునే సినిమావాళ్లు ఈ సారి టార్గెట్ అవుతున్నారు. షూటింగ్‌ల‌లో పాల్గొంటున్న సినీ ప్ర‌ముఖులు ఒక్కొక్క‌రుగా ఈ వైర‌స్ బారిన ప‌డటం కంగారు పుట్టిస్తోంది. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడ్డారు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్, సోను సూద్‌తో పాటు దర్శకుడు అనిల్ రావిపూడి కరోనా బారిన పడ్డారు. ఇప్పుడు మరో తెలుగు డైరక్టర్ కు కరోనా పాజిటివ్ వచ్చింది.

రవితేజ ప్రధానపాత్రలో 'ఖిలాడీ' టైటిల్ తో చిత్రం రూపొందిస్తున్న రమేష్ వర్మ పరీక్షలు చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది. దాంతో షూటింగ్ ఆపేసారు. టీమ్ మొత్తం ఐసోలేషన్ లోకి వెళ్లింది. రవితేజ సంగతి తెలియదు. దర్శకుడు రమేష్ వర్మ మాత్రం ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలియచేస్తూ పోస్ట్ పెట్టారు. తాను హోం క్వారంటైన్‌లో ఉంటూ కోవిడ్‌కు చికిత్స తీసుకుంటున్నట్టు తెలియచేసారు. అలాగే అందరూ మాస్క్ లు పెట్టుకోవాలని విజ్ఞప్తి చేసారు.

క్రాక్ ఇచ్చిన బూస్టింగ్ తో ఫామ్ లోకి వచ్చిన రవితేజ నుంచి వస్తున్న తర్వాతి సినిమా కావడంతో ఖిలాడీ మీద భారీ అంచనాలే ఉన్నాయి. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ లో రవితేజ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడని అంటున్నారు. కానీ ఆ క్యారెక్టర్స్ ఏంటన్నది మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఇండస్ట్రీ చెప్పుకునేదాని ప్రకారం, ఈ సినిమాలో తండ్రీ కొడుకులుగా రవితేజ కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.

అనసూయ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే గతంలో రవితేజ, రమేష్ వర్మలు వీర అనే సినిమా చేశారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఖిలాడీ చేస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ సినిమా మే 28న రిలీజ్ కు ప్లాన్ చేసారు.