Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్​: మనోజ్​ బాజ్​ పాయ్​ చిత్రానికి బ్రేక్​.!

By:  Tupaki Desk   |   18 March 2021 11:11 AM GMT
కరోనా ఎఫెక్ట్​: మనోజ్​ బాజ్​ పాయ్​ చిత్రానికి బ్రేక్​.!
X
దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తున్నది. సినిమా షూటింగ్​లపై మళ్లీ కరోనా ఎఫెక్ట్​ పడుతున్నది. కరోనా కేసులు తగ్గడంతో కొంతకాలం క్రితం 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లకు అనుమతి ఇచ్చారు. షూటింగ్​లు కూడా యథావిధిగా నడుస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో మళ్లీ సినిమా షూటింగ్​లకు బ్రేక్​ పడుతోంది. తాజాగా ప్రముఖ నటుడు మనోజ్​ బాజ్​ పాయ్​ నటిస్తున్న ఓ సినిమా ఆగిపోయింది.

మనోజ్​ బాజ్​ పాయ్​ ‘డిస్పాచ్​’ అనే ఓ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు డైరెక్టర్​ కాను భెల్​. మొదట అతడికి కరోనా వచ్చింది. దీంతో షూటింగ్​ నిలిపివేశారు. ఆ తర్వాత కొంతకాలానికి పరీక్షలు చేయించుకోగా.. మనోజ్ బాజ్​ పాయ్​ కు కూడా కరోనా సోకింది.

ఈ విషయంపై మనోజ్​ మాట్లాడుతూ.. ‘ జాగ్రత్తలు తీసుకుంటే షూటింగ్ జరపుకోవడం పెద్ద కష్టమేమి కాదు. కానీ ఒక్కరి అజాగ్రత్త వల్ల మేము ఎంతో నష్టపోయాం. ప్రస్తుతం షూటింగ్​ ఆగిపోయింది’ అని మనోజ్​ పేర్కొన్నారు.

తాను ప్రస్తుతం క్వారంటైన్​లో ఉన్నానని.. నెమ్మదిగా కోలుకుంటున్నానని మనోజ్​ పేర్కొన్నాడు.
మనోజ్‌ నటించిన తాజా సినిమా ‘సైలెన్స్‌... కెన్‌ యూ హియర్‌ ఇట్‌’ జీ5లో మార్చి 26 నుంచి స్ట్రీమ్‌ కానుంది. 'హఠాత్తుగా అదృశ్యమైపోయిన ఒక స్త్రీని వెతకడం ఈ కథ. చాలా ఆసక్తిగా ఉంటుంది’ అని మనోజ్‌ బాజ్‌ పాయ్‌ అన్నాడు.

కరోనా తగ్గిపోయింది అని అందరూ అనుకుంటున్న వేళ.. ముంబైలో కరోనా కేసులు బెంబేలెత్తిస్తున్నాయి. ఆ రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా తీవ్ర రూపం దాల్చుతున్నది. అక్కడి ప్రభుత్వం కఠిన ఆంక్షలు కూడా అమలు చేస్తున్నది. అంతేకాక దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా కరోనా తీవ్రత ఎక్కువైంది. దీంతో సినిమా ఇండస్ట్రీ వాళ్లు మళ్లీ భయాందోళనకు గురవుతున్నారు.