Begin typing your search above and press return to search.

నాని వైఖరితో ఫ్యాన్స్ లో కలవరం..?

By:  Tupaki Desk   |   23 April 2022 5:30 PM GMT
నాని వైఖరితో ఫ్యాన్స్ లో కలవరం..?
X
నేచురల్ స్టార్ నాని పక్కింటి అబ్బాయి తరహా పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తన సహజమైన నటనతో యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాడు. ఆన్ స్క్రీన్ పై అలరించే నాని.. ఆఫ్ స్క్రీన్ లోనూ అందరితో చాలా జోవియల్ గా ఉంటారనే పేరుంది. హంబుల్ బిహేవియర్ కు ఆయన ట్రేడ్ మార్క్. మీడియా ముందు అతని వైఖరి చాలా డీసెంట్ గా ఉంటుంది.

టాలీవుడ్‌ లో వినయపూర్వకమైన ప్రవర్తనకు పర్యాయపదంగా ఉంటాడు కాబట్టే, మిగతా హీరోల అభిమానులందరూ నాని కి మ్యూచువల్ ఫ్యాన్స్ గా ఉంటారు. అయితే ఇటీవలి కాలంలో ఆయన తీరు ఫ్యాన్స్ ను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ - ప్రెస్ మీట్స్ లో నాని అవాంఛనీయ ప్రకటనలు చేస్తూ వివాదాలు కొని తెచ్చుకుంటున్నారు.

'స్కైల్యాబ్' ఈవెంట్ లో థియేటర్లపై నాని చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. అలానే 'టక్ జగదీష్' చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేసిన నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్స్ తో హీరోకి వివాదం ఏర్పడే పరిస్థితి వచ్చింది. 'శ్యామ్ సింగరాయ్' విడుదల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ లో టిక్కెట్ ధరలపై నాని చేసిన కామెంట్స్ ఆ మధ్య టాలీవుడ్ లో పెద్ద దుమారమే రేపాయి.

నాని వ్యాఖ్యలు సినిమా నిర్మాతలు మరియు ఏపీలో డిస్ట్రిబ్యూటర్స్ పై ప్రభావం చూపిందనే సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా తెలుగు సినిమాలు కన్నడలో డబ్ కాకపోవడం వివాదానికి దారితీసింది. 'అంటే సుందరానికీ!' సినిమాని కన్నడలో డబ్ చేయకపోవడం పై నాని ఇచ్చిన వివరణ నెట్టింట చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

ఇలా నాని కావాలని చేయకపోయినా.. ఆ స్టేట్మెంట్స్ అతని ఇమేజ్‌ కి నష్టం కలిగించే అవకాశం ఉందని ఫిలిం సర్కిల్స్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. పీఆర్‌ వైస్ చూసుకుంటే రాబోయే సినిమాల విషయంలో ఇది మంచి వ్యూహమే కానీ.. వివాదాస్పద నటుడనే పేరు వస్తే మాత్రం.. ఇదే పబ్లిక్‌ లో తన సొంత బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బ తీసే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇక సినిమాల విషయనికొస్తే.. నాని హీరోగా నటించిన 'అంటే.. సుందరానికీ!' సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నజ్రియా హీరోయిన్ గా నటించింది. జూన్ 10న విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

మరోవైపు రూరల్ యాక్షన్ థ్రిల్లర్ 'దసరా' మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇది నాని కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. దసరా సీజన్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే నాని మైలురాయి 30వ చిత్రంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.