Begin typing your search above and press return to search.

ప్రియదర్శి మరో రూపం..

By:  Tupaki Desk   |   16 Feb 2019 6:18 AM GMT
ప్రియదర్శి మరో రూపం..
X
'పెళ్లి చూపులు' ఫేం ప్రియదర్శి ప్రస్తుతం టాలీవుడ్‌ లో మోస్ట్‌ బిజీ కమెడియన్‌ గా మారిపోయాడు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలా చిత్రాల్లో నటిస్తున్నాడు. ఒక వైపు కమెడియన్‌ గా నటిస్తూనే మరో వైపు చేనేత కార్మికుడు - పద్మ అవార్డు గ్రహీత చింతకింద మల్లేశం బయోపిక్‌ లో నటిస్తున్నాడు. చాలా సీరియస్‌ పాత్ర అయిన మల్లేశం పాత్రను చేయడం వల్ల ప్రియదర్శి చాలా పెద్ద సవాల్‌ ను స్వీకరించినట్లయ్యింది. నవ్వించడంలో సక్సెస్‌ అయిన ప్రియదర్శి గుండెలు పిండి - కన్నీరు పెట్టించడంలో సఫలం అవుతాడో చూడాలి. కమెడియన్‌ నుండి సీరియస్‌ నటుడిగా రూపాంతరం చెందిన ప్రియదర్శి మరో రూపంలోకి కూడా మారబోతున్నట్లుగా తెలుస్తోంది.

ప్రియదర్శి మరియు రాహుల్‌ రామకృష్ణ లు హీరోలుగా కలిసి నటించిన 'మిఠాయి' చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. తాజాగా ఆ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 'పెళ్లి చూపులు' దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ హాజరు అయ్యాడు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రియదర్శి త్వరలో దర్శకత్వం చేయబోతున్నట్లుగా రివీల్‌ చేశాడు.

నేను నటుడిగా మారానంటూ ఏడిపిస్తున్న ప్రియదర్శి త్వరలోనే దర్శకత్వం చేయనున్నాడు అంటూ తరుణ్‌ భాస్కర్‌ చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో ప్రియదర్శి కాదన్నట్లుగా నవ్వినా - ఆ తర్వాత మాట్లాడుతూ మాత్రం తరుణ్‌ మాటలను కొట్టి పారేయలేదు. దాంతో ప్రియదర్శి దర్శకత్వం ప్లాన్‌ నిజమే అనిపిస్తుంది. ప్రస్తుతం నటుడిగా బిజీగా ఉన్న ప్రియదర్శి దర్శకత్వ రూపం త్వరలోనే చూస్తామేమో..!