Begin typing your search above and press return to search.

'పుష్ప' కోసం ఆ స్టార్‌ తో సంప్రదింపులపై క్లారిటీ

By:  Tupaki Desk   |   29 Nov 2020 7:50 AM GMT
పుష్ప కోసం ఆ స్టార్‌ తో సంప్రదింపులపై క్లారిటీ
X
అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్‌ ప్రతిష్టాత్మక చిత్రం 'పుష్ప'. రష్మిక మందన్న హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమాలో విలన్‌ గా నటిస్తున్నది ఎవరు అంటూ గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఎంతో మంది పేర్లు విలన్‌ పాత్రకు పరిశీలిస్తున్నట్లుగా వచ్చాయి. తాజాగా తమిళ స్టార్‌ హీరో విక్రమ్‌ ను పుష్పలోని ముఖ్యమైన పాత్ర కోసం ఎంపిక చేశారు అంటూ వార్తలు వచ్చాయి. ఆయన వచ్చే ఏడాది ఆరంభంలో నెల రోజుల పాటు పుష్ప చిత్రీకరణలో పాల్గొనబోతున్నట్లుగా పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఆ వార్తలు పూర్తిగా అవాస్తవం అంటూ యూనిట్‌ సభ్యులు క్లారిటీ ఇచ్చారు.

మీడియా వర్గాల వారితో మైత్రి మూవీ మేకర్స్‌ అనఫిషియల్‌ గా మాట్లాడుతూ ఇప్పటి వరకు పుష్ప కోసం విక్రమ్‌ తో సంప్రదింపులు జరపలేదు అని.. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవం అంటూ క్లారిటీ ఇచ్చారట. విక్రమ్‌ ప్రస్తుతం తమిళంలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇలాంటి సమయంలో ఆయన తెలుగు సినిమా.. అది కూడా విలన్‌ గా అంటే నమ్మశక్యంగా లేదని మొదటి నుండి కొందరు అనుకుంటూ వచ్చాను. తాజాగా ఆ విషయంపై మైత్రి వారు క్లారిటీ ఇవ్వడంతో స్పష్టత వచ్చింది. అయితే పుష్పలో విలన్‌ ఎవరు అనే విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.