Begin typing your search above and press return to search.

క్లారిటీ : హమీదా ప్రైవేట్‌ పార్ట్‌ పై అఖిల్ కావాలని టచ్ చేశాడా...?

By:  Tupaki Desk   |   28 March 2022 4:40 AM GMT
క్లారిటీ : హమీదా ప్రైవేట్‌ పార్ట్‌ పై అఖిల్ కావాలని టచ్ చేశాడా...?
X
తెలుగు బిగ్ బాస్ నాన్‌ స్టాప్‌ నాలుగు వారాలు పూర్తి చేసుకుని అయిదవ వారంలోకి అడుగు పెట్టింది. ప్రతి ఒక్క బిగ్‌ బాస్ ప్రేమికుడు కూడా షో ను తెగ ఎంజాయ్‌ చేస్తున్నామని చెబుతుంటే.. ఎప్పటిలాగే కొందరు బిగ్‌ బాస్‌ను బూతులు తిడుతూ బ్యాన్ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. అమ్మాయిలు.. అబ్బాయిల మద్య గొడవలు.. రొమాన్స్ లను చూపిస్తూ షో కు ఆధరణ దక్కించుకోవాలని నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నారు.

బిగ్ బాస్ గత వారం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో భాగంగా లైక్స్ ను దక్కించుకునే క్రమంలో హమీద యొక్క ప్రైవేట్‌ పార్ట్ పై అఖిల్‌ చేయి వేశాడు. ఆ సమయంలో హమీదా చాలా బాధ పడింది. ఆమె ఆ సమయంలో తీవ్రంగా వ్యాఖ్యలు చేసింది. అయితే హమీదా వ్యాఖ్యలపై అఖిల్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. తాను అలా చేయలేదు.. కావాలని తాను ముట్టుకోలేదు అంటూ చెప్పే ప్రయత్నం చేశాడు.

హమీదా చేసిన పనితో అఖిల్‌ పై ఒక వర్గం ప్రేక్షకులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం తో పాటు చాలా వరకు అఖిల్ ను తప్పు బడుతున్నారు. ఆ విషయమై క్లారిటీ ఇచ్చేందుకు నాగార్జున ఆది వారం ఎపిసోడ్‌ లో ఇద్దరిని కూడా కన్ఫెషన్ రూమ్‌ కి పిలిచారు. మొదట హమీద వెళ్లగా ఏం జరిగిందో చెప్పమన్నాడు. ఆ రోజు జరిగిన విషయాన్ని హమీద చెప్పింది. అయితే అఖిల్‌ కావాలని చేశాడని తాను భావించడం లేదని చెప్పింది.

అఖిల్ ను పిలిచి కూడా నాగార్జున మాట్లాడాడు. ఆ సమయంలో కూడా అఖిల్ తాను కావాలని టచ్ చేయలేదు అంటూ చెప్పే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత వీడియోను ప్లే చేసి ఇంటి సభ్యుల అందరి అభిప్రాయంను నాగార్జున తీసుకున్నాడు. అందులో ఎక్కువ శాతం మంది కూడా అఖిల్ కావాలని టచ్ చేయలేదు అంటూ చెప్పేశారు. దాంతో అఖిల్‌ ఆ తప్పు చేయలేదని నాగార్జున క్లారిటీగా చెప్పేశాడు.

హమీద విషయంలో అఖిల్ తప్పు చేయలేదు కనుక ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే గొడవ అయిపోయేది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. నాగార్జున కూడా అదే అన్నాడు. ఆ తర్వాత సన్ డే రోజు ఎపిసోడ్‌ లో ఫుల్‌ గా ఫన్‌ ను నాగార్జున నింపేశాడు. కంటెస్టెంట్స్ లో ఒకొక్కరిని సేవ్‌ చేస్తూ మెల్ల మెల్లగా ఎపిసోడ్‌ ను నడిపించి సరయును చివరికి ఎలిమినేట్‌ చేస్తున్నట్లుగా ప్రకటించాడు.

కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా బిందు మాధవి మరియు అఖిల్‌ మద్య కూడా గొడవ జరిగింది. ఆ గొడవ విషయంలో కూడా మాట్లాడాడు. అయితే ఇద్దరం కలిసి పోయాం అన్నట్లుగా వారిద్దరు మాట్లాడి అందరిని సర్‌ ప్రైజ్ చేశారు. నువ్వు ఆడ అంటూ అఖిల్‌ ను బిందు మాధవి అవమానించింది అంటూ బయట అఖిల్‌ అభిమానులు గగ్గోలు పెట్టేశారు. తీరా అంతా ప్రశాంతం అయ్యింది.