Begin typing your search above and press return to search.

సింహం బొమ్మతో బాలయ్యను చూపిస్తే.. చిరంజీవిని ఏ విధంగా చూపిస్తారో..!

By:  Tupaki Desk   |   12 Jun 2021 5:30 PM GMT
సింహం బొమ్మతో బాలయ్యను చూపిస్తే.. చిరంజీవిని ఏ విధంగా చూపిస్తారో..!
X
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రస్తుతం సుమారు 10 ప్రాజెక్ట్స్ కు సంబంధించిన ప్రొడక్షన్ జరుగుతోంది. టాలీవుడ్ స్టార్ హీరోలందరితో సినిమాలు సెట్ చేసుకొని దూకుడుమీదున్నారు నిర్మాతలు నవీన్ ఎర్నేని - వై.రవిశంకర్. లేటెస్టుగా నటసింహం నందమూరి బాలకృష్ణ తో '#NBK107' చిత్రాన్ని అధికారిక ప్రకటన ఇచ్చారు. ఈ మేరకు సింహం ఫొటోతో త్వరలోనే వేట మొదలు కానుందని ఓ మోషన్ పోస్టర్ ను కూడా విడుదల చేసారు.

సింహానికి ప్రతీకగా బాలయ్య ను చూపిస్తూ డిజైన్ చేసిన 'NBK107' మోషన్ పోస్టర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. వాస్తవ సంఘటన ఆధారంగా ఆయన మాస్ ఇమేజ్‌ కు తగ్గట్టు స్టోరీతో ఈ సినిమా రూపొందించనున్నారు. 'క్రాక్' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం టాప్ టెక్నిషియన్స్ - స్టార్ క్యాస్టింగ్ ని తీసుకుంటున్నారు.

ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి తో కూడా మైత్రీ మూవీ మేకర్స్ ఓ మూవీ కమిట్ అయ్యారు. డైరెక్టర్ బాబీ (కేఎస్ రవీంద్ర) ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. చిరు సినిమా అనౌన్సమెంట్ ని మైత్రీ టీమ్ ఏ రేంజ్ లో ప్లాన్ చేస్తుందో అని ప్రస్తుతం ఫిలిం సర్కిల్స్ లో డిస్కషన్ చేస్తున్నారు. బాల‌య్య బర్త్ డే కి సింహం బొమ్మతో న్యూ ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ ఇచ్చి నంద‌మూరి ఫ్యాన్స్ ని ఆకట్టుకున్న మైత్రి వారు.. ఇప్పుడు మెగా అభిమానుల్ని ఆక‌ట్టుకోవ‌డానికి ఎలాంటి ప్లాన్స్ తో వ‌స్తారో చూడాలి.