Begin typing your search above and press return to search.

వ‌కీల్ సాబ్ ఈవెంట్లో `చిరు-ప‌వ‌న్-చ‌ర‌ణ్` సంద‌డి?!

By:  Tupaki Desk   |   19 March 2021 3:34 AM GMT
వ‌కీల్ సాబ్ ఈవెంట్లో `చిరు-ప‌వ‌న్-చ‌ర‌ణ్` సంద‌డి?!
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం `వ‌కీల్ సాబ్`. శ్రుతిహాస‌న్ క‌థానాయిక‌. అంజలి- నివేద‌ థామస్- అనన్య నాగేళ్ల కీలకపాత్రల్లో న‌టించారు. ఏప్రిల్ లో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమాకి ప్రీబిజినెస్ చాలా ముందే పూర్త‌యింద‌న్న‌ టాక్ ఉంది. శ్రీ‌రామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు- బోనీక‌పూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రిలీజ్ కి ఇంకెంతో స‌మ‌యం లేదు కాబ‌ట్టి ఇప్ప‌టికే ప్ర‌చారం ప‌రంగా హైప్ పెంచేందుకు దిల్ రాజు బృందం స‌న్నాహ‌కాల్లో ఉంది. వకీల్ సాబ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఏప్రిల్ 3 న జరుగ‌నుంది. ఈ వేడుక‌లో పాల్గొనే ముఖ్య అతిథి ఎవ‌రు అన్న‌ది ఇంకా ఫైన‌ల్ కాలేద‌ని తెలుస్తోంది.

త‌మ్ముడి కోసం మెగాస్టార్ చిరంజీవి సినీపెద్ద హోదాలో వ‌స్తారు. ముఖ్య అతిథులలో ఒకరిగా వేదిక‌పై సంద‌డి చేస్తారు. కానీ చిరు మాత్ర‌మే స‌రిపోరని.. ఈ వేడుక‌కు ఇంకా ఏదో ప్ర‌త్యేక‌త కావాల‌ని దిల్ రాజు- బోనీక‌పూర్ బృందం భావిస్తున్నార‌ట‌. ఇండియా లెవ‌ల్లో ఒక పెద్ద స్టార్ కోసం వెతుకుతున్నార‌ని తెలుస్తోంది. అతను ఈ ఈవెంట్లోనే పెనుసంచ‌ల‌నం సృష్టిస్తాడు. నిర్మాత బోనీ కపూర్ ఒక హిందీ తారను తీసుకురావాలని యోచిస్తున్నట్లు క‌థ‌నాలొస్తున్నాయి. అయితే దీనిపై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.

ఇండియా లెవ‌ల్లో ది బెస్ట్ గా ఈ వేడుక సాగాల‌ని దిల్ రాజు ‌బృందం భావిస్తోంది. త‌దుప‌రి రామ్ చ‌ర‌ణ్ - శంక‌ర్ కాంబినేష‌న్ లో అత్యంత భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న దిల్ రాజు వ‌కీల్ సాబ్ ఈవెంట్ తోనే అటు బాలీవుడ్ లోనూ మార్మోగాల‌ని చూస్తున్నార‌ట‌. అందుకే ఈ ఈవెంట్ వేదిక‌పై `చిరంజీవి-ప‌వ‌న్-చ‌ర‌ణ్` క‌నిపిస్తార‌ని.. వారితో పాటు బాలీవుడ్ అగ్ర హీరో సంద‌డి షురూ అవుతుంద‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.