Begin typing your search above and press return to search.

చిరు బాబీలను కలిపేది మైత్రినేనా

By:  Tupaki Desk   |   6 Aug 2020 10:30 AM GMT
చిరు బాబీలను కలిపేది మైత్రినేనా
X
మెగాస్టార్‌ చిరంజీవి ఆచార్య చిత్రం తర్వాత మలయాళ సూపర్‌ హిట్‌ చిత్రం లూసీఫర్‌ ను రీమేక్‌ చేయాలనుకున్నాడు. సుజీత్‌ కు లూసీఫర్‌ రీమేక్‌ బాధ్యతలు అప్పగిస్తే ఆయన స్క్రిప్ట్‌ విషయంలో నిరాశ పర్చాడట. దాంతో ఆ సినిమాకు ముందు బాబీ దర్శకత్వంలో సినిమాను మొదలు పెట్టాలని చిరు భావిస్తున్నాడంటూ టాక్‌ వినిపిస్తుంది. ఈ నెలలో చిరంజీవి బర్త్‌ డే సందర్బంగా ఆచార్య ఫస్ట్‌ లుక్‌ తో పాటు బాబీ దర్శకత్వంలో చేయబోతున్న సినిమాకు సంబంధించిన ప్రకటన కూడా రాబోతుందని ఇటీవలే వార్తలు వచ్చాయి.

చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా రామ్‌ చరణ్‌ ఆయన సినిమాలను నిర్మిస్తున్నాడు. ఖైదీ నెం.150.. సైరా.. ఆచార్య అన్ని కూడా చరణ్‌ నిర్మాతగానే తెరకెక్కాయి. అయితే ఈసారి మాత్రం మైత్రి మూవీ మేకర్స్‌ వారు చిరు బాబీల కాంబో మూవీని నిర్మించబోతున్నారట. ఈమద్య కాలంలో భారీ చిత్రాలను నిర్మిస్తు సూపర్‌ హిట్స్‌ను దక్కించుకుంటున్న మైత్రి వారు మెగాస్టార్‌ కి బాబీతో కథ చెప్పించి ఓకే చేయించుకున్నారని చిరు డేట్లు కూడా ఇచ్చేందుకు ఓకే చెప్పారంటూ వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమా అధికారిక ప్రకటన చిరు బర్త్‌ డే సందర్బంగా వచ్చే అవకాశం ఉంది. మైత్రి మూవీ మేకర్స్‌ వారు సినిమాల ప్రకటన విషయంలో ఫస్ట్‌ లుక్‌ విషయంలో చాలా స్పీడ్‌ గా ఉంటారు. వారి సినిమాలు ప్రారంభంకు ముందే ఫస్ట్‌ లుక్‌ లేదా ప్రీ ఫస్ట్‌ లుక్‌ వస్తూ ఉంటుంది. అలాగే మెగాస్టార్‌ మూవీ విషయంలో కూడా ప్రకటన చేసేందుకు మైత్రి వారు ఏర్పాట్లు చేస్తున్నారట. చిరు బర్త్‌ డే రోజు అన్ని విషయాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.