Begin typing your search above and press return to search.

జనవరి 30 నుండి బుల్లితెరపై చిరంజీవి

By:  Tupaki Desk   |   11 Jan 2017 9:33 AM IST
జనవరి 30 నుండి బుల్లితెరపై చిరంజీవి
X
మెగాస్టార్ చిరంజీవి 9 సంవత్సరాల తర్వాత వెండితెరపై మెరవనున్నారు. ఇప్పటికే ఆన్ లైన్ హంగామా.. సోషల్ మీడియా సంచలనాలు.. జూక్ బాక్స్ రికార్డులు చాలానే తిరగరాసేసిసి చిరు.. ఇప్పుడు థియేట్రికల్ రికార్డుల అంతు చూసేందుకు సిద్ధమయ్యారు. అయితే.. ఇది చిరంజీవి వెండితెర ఎంట్రీ మాత్రమే. మాటీవీలో ప్రసారమయ్యే మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమం ద్వారా బుల్లితెరపై కూడా చిరు అరంగేట్రం ఇప్పటికే ఖాయమైంది. అందుకు సంబంధించిన ప్రోమోస్ కూడా కొన్ని నెలలుగా టెలికాస్ట్ అవుతున్నాయి.

ఇప్పుడీ కార్యక్రమాన్ని జనవరి 30నుంచి టెలికాస్ట్ చేయడం ప్రారంభించనున్నట్లు వెల్లడించారు చిరంజీవి. నిజానికి చిరు హోస్ట్ చేసే మీలో ఎవరు కోటీశ్వరుడు డిసెంబర్ లోనే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ.. బిగ్ స్క్రీన్ రీ ఎంట్రీ పూర్తయ్యే వరకూ.. ఉద్దేశ్యపూర్వకంగానే ఆ కార్యక్రమం ప్రసారాన్ని హోల్డ్ లో ఉంచామని.. ఈ మేరకు మాటీవీ యాజమాన్యం-తాను చర్చలు జరిపి తుది నిర్ణయానికి వచ్చామని చెప్పారు మెగాస్టార్.

టివి షోస్ ద్వారా.. తన కెరీర్ లో ఎంతో మంది తనను ఎంతోమంది ఇంటర్యూలు చేశారని.. ఇప్పుడు వారి టైపులో తను ఇంటర్యూలు చేయడం బాగుందని వ్యాఖ్యానించారు మెగాస్టార్ చిరంజీవి. అంతే కాదు.. ఇప్పటికే చాలా ఎపిసోడ్స్ షూటింగ్ పూర్తయిపోగా.. కొన్నిటికి మాత్రం ఇంకా కంప్లీట్ చేయాల్సి ఉందట. పండుగ తర్వాత వీటి షూటింగ్ కి కూడా ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు చిరు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/