Begin typing your search above and press return to search.

అడివి శేష్ - అక్కినేని మేనల్లుళ్ళ బాక్స్ ఆఫీస్ రచ్చ!

By:  Tupaki Desk   |   3 Aug 2018 5:17 PM GMT
అడివి శేష్ - అక్కినేని మేనల్లుళ్ళ బాక్స్ ఆఫీస్ రచ్చ!
X
ఈమధ్య రిలీజ్ అయిన సినిమాల్లో ఒక్క 'RX 100' తప్ప మిగతా సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర తుస్సన్నాయి. దాదాపు కొన్ని వారాలుగా బాక్స్ ఆఫీస్ దగ్గర వాతావరణం డల్లుగా ఉంది. కానీ ఈరోజు రిలీజ్ అయిన మూడు సినిమాల్లో రెండు సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సందడిని తీసుకొచ్చాయి. ఆ రెండూ సినిమాలు 'గూఢచారి' - 'చి ల సౌ'.

ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే రెండూ సినిమాల జానర్లు పూర్తిగా వేరు కావడం. 'గూఢచారి' స్పై థ్రిల్లర్ కాగా 'చి ల సౌ' లవ్ కమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. రెండు సినిమాలకు మార్నింగ్ షో నుంచే మంచి టాక్ - రివ్యూస్ రావడంతో బాక్స్ ఆఫీస్ సందడి ఇలాగే కొద్ది రోజులు కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. 'గూఢచారి' ఇప్పటివరకూ తెలుగులో తెరకెక్కిన స్పై థ్రిల్లర్ లలో పూర్తి మోడరన్ టచ్ ఉన్న సినిమా అని హాలీవుడ్ స్టైల్ మేకింగ్ తో టార్గెట్ ఆడియన్స్ ను కట్టిపడేస్తోందని రిపోర్ట్స్ వస్తున్నాయి. మరోవైపు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన సుశాంత్ 'చి ల సౌ' క్లీన్ కామెడీతో సాధారణ ప్రేక్షకులనే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఉందని అంటున్నారు.

శుక్రవారమే బాక్స్ ఆఫీస్ వద్ద శేష్ - సుశాంత్ లు ఇద్దరూ సందడి తెచ్చారు కాబట్టి అది శనివారం - ఆదివారం కూడా కంటిన్యూ అవుతుంది. మరి ఏ రేంజ్ హిట్లో అనే విషయం మాత్రం మొదటి సోమవారం తర్వాతే తేలుతుంది. ఏదేమైనా గత కొన్ని రోజులుగా డల్లుగా ఉన్న టికెట్ కౌంటర్లను సందడిగా మార్చిన ఘనత అడివి శేష్ - అక్కినేని మేనల్లుళ్ళదే!