Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ లో ఆ నటి దగ్గర రూపాయి లేదట.. తాజా ఇంటర్వ్యూలో ఎమోషన్

By:  Tupaki Desk   |   18 Aug 2022 5:00 AM GMT
లాక్ డౌన్ లో ఆ నటి దగ్గర రూపాయి లేదట.. తాజా ఇంటర్వ్యూలో ఎమోషన్
X
నటిగా వెండితెరమీద ఫ్రూవ్ చేసుకోవటం ఒక ఎత్తు.ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేయటం మరో ఎత్తు. అన్నింటికి మించిన చాలామంది నటీమణుల మాదిరి.. కాస్తంత టైం అయ్యాక ఇండస్ట్రీ నుంచి ఎగ్జిట్ కావటం చాలామంది నటీమణుల్లో చూస్తుంటాం. పెళ్లి.. పిల్లలు.. ఫ్యామిలీతో సినిమా కెరీర్ కు పుల్ స్టాప్ పెట్టేసి.. బయటకు వెళ్లిపోవటం.. కొన్నేళ్ల తర్వాత మళ్లీ ఎంట్రీ ఇవ్వటం లాంటివి చేస్తుంటారు.

అందుకు భిన్నంగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఏళ్లు అవుతున్నా.. కంటిన్యూ కావటమే కాదు.. సొంత ప్లేస్ ను వదిలేసి.. హైదరాబాద్ ను హోంటౌన్ గా మార్చేసుకున్న నటి కమ్ నిర్మాత ఎవరైనా ఉన్నారంటే అది ఛార్మీనే అవుతుంది.

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ తో కలిసి చిత్ర నిర్మాణం చేపట్టిన ఆమె.. తాజాగా సన్సేషన్ హీరో విజయ్ దేవరకొండతో లైగర్ మూవీని చేయటం.. దానికి కరణ్ జోహార్ లాంటి బాలీవుడ్ అగ్రశ్రేణి డైరెక్టర్ నిర్మాత ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం కావటం తెలిసిందే. ఇప్పటికే నిర్మాణాంతర కార్యక్రమాల్ని పూర్తిచేసుకొంటూ.. పెద్ద ఎత్తున ప్రేక్షకుల ముందుకు వెళుతూ.. భారీ ఎత్తున ప్రచారాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో తాజాగా విజయ్ ను.. పూరీని కలిసి ఛార్మి ఇంటర్వ్యూ చేశారు. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. రేపు (శుక్రవారం) విడుదల కానున్న ఈ పూర్తి ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలకు కొదవ లేదన్నట్లుగా ఉందని చెప్పాలి. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ తో సినిమా మీద భారీగా అంచనాలు పెరిగిపోవటం తెలిసిందే. ఈ సినిమా గురించిన చాలా ప్రశ్నల్ని సూటిగా.. నిర్మోహమాటంగా అడిగిన ఛార్మీ ఇంటర్వ్యూ ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.

తాను అడిగిన ప్రశ్నలు తనవి కావని.. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ నుంచి వచ్చిన ప్రశ్నలుగా ఆమె వెల్లడించారు. ఈ క్రమంలో ఆమె పలు ప్రశ్నలు అడగటం ఒక ఎత్తు అయితే.. తనకు సంబంధించిన విషయాల్ని చెబుతూ.. లాక్ డౌన్ వేళ తన జేబులో రూపాయి లేదంటూ ఎమోషన్ అయ్యింది.

అలాంటి వేళలో ఓటీటీ నుంచి భారీ ఆఫర్ వచ్చిందని.. అంత పెద్ద ఆఫర్ ను రిజెక్టు చేయటానికి దమ్ము కావాలన్న ఆమె మాటలకు విజయ్.. పూరీ చూస్తుండిపోయారు. పూరీ కల్పించుకొని నీ కష్టాలు అర్థమవుతున్నాయి. ఎన్నిసార్లు ఏడ్చి ఉంటావ్.. అంటూ సాంత్వన పలికే ప్రయత్నం చేశారు. ఆసక్తికరంగా మారిన ఈ ప్రోమో మీద ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి వ్యక్తమవుతోంది.