Begin typing your search above and press return to search.

షాకింగ్ నిజాన్ని చెప్పిన ఛార్మీ

By:  Tupaki Desk   |   24 Oct 2021 4:45 AM GMT
షాకింగ్ నిజాన్ని చెప్పిన ఛార్మీ
X
ఒకటి కాదు రెండు కాదు బోలెడన్ని వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే హీరోయిన్ల పేర్లలో ఛార్మీ కౌర్ పేరు వినిపిస్తూ ఉంటుంది. టాలీవుడ్ ను షేక్ చేసిన డ్రగ్స్ కేసు మొదలుకొని ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించి వచ్చే పుకార్లకు అంతేపొంతు ఉండదు. అయినప్పటికీ వాటిని ఎదుర్కొంటూ.. మరింత బలంగా తయారవుతూ ఎప్పటికప్పుడు తనను తాను మార్చుకోవటం.. సరికొత్తగా ప్రజెంట్ చేయటంలో ఆమె ముందుంటారు. కొన్నేళ్లుగా నటనకు దూరంగా ఉంటున్న ఆమె.. పూరీ కనెక్ట్ పేరుతో ఏర్పాటు చేసిన నిర్మాణ సంస్థలో ఆమె భాగస్వామ్యం అయ్యారు. ఒకప్పుడు హీరోయిన్ గా ఉన్న ఆమె ఇప్పుడు నిర్మాతగా బాధ్యతల బరువుల్ని మోస్తున్నారు.

తాజాగా రొమాంటిక్.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన ‘లైగర్’ మూవీలకు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఆమె.. తాజాగా ఒక ప్రత్యేక ఇంటర్వ్యూను ఇచ్చారు. ఇందులో ఆమె షాకింగ్ నిజాన్ని చెప్పారు. ఒకప్పుడు హీరోయిన్ అయినా.. ఇప్పుడు నిర్మాతగా మారిన తర్వాత గాడిద చాకిరి చేయాల్సి వస్తోందన్నారు. నటన నిర్మాణం రెండు ఇష్టమే అయినా.. ఈ రెండింటికి అసలు పోలికే లేదన్నారు.

హీరోయిన్ గా చేసే వేళలో కంఫర్ట్ ఎక్కువగా ఉండేదని.. కేవలం ఫిట్ నెస్.. బ్యూటీ మీద ఫోకస్ చేస్తే సరిపోయేదని.. నిర్మాతగా మాత్రం అందరి కంఫర్ట్ చూడాల్సిన బాధ్యత ఉంటుందన్నారు. సినిమా మొదలైనప్పటి నుంచి పూర్తి అయ్యే వరకు గాడిద చాకిరీ చేయాలని.. రోజంతా కష్టపడాలన్నారు. ఇప్పటికి తనకు వారానికి రెండు.. మూడు ఆఫర్లు వస్తుంటాయని.. నటించమని అడుగుతారని చెప్పారు. అయితే.. తానిప్పుడు నిర్మాణ రంగంలో ఉన్న నేపథ్యంలో నటించే అవకాశం లేదన్నారు. ‘‘ఇక ఎప్పటికి నటించలేనేమో’’ అంటూ షాకింగ్ వ్యాఖ్య చేయటం గమనార్హం.