Begin typing your search above and press return to search.

ఛార్మి మిడిల్ ఫింగర్ ఎవరికి చూపిస్తోందబ్బా?

By:  Tupaki Desk   |   7 Aug 2019 5:41 AM GMT
ఛార్మి మిడిల్ ఫింగర్ ఎవరికి చూపిస్తోందబ్బా?
X
ఛార్మీ సినిమాలలో నటించడం మానేసి ఇప్పటికి దాదాపు నాలుగేళ్ళయింది. నటిగా ఛార్మి చివరి సినిమా 'జ్యోతిలక్ష్మి'. అలా అని గ్లామర్ ఫీల్డ్ కు దూరంగా లేదు.. నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. పూరి జగన్నాధ్ కలిసి పూరి కనెక్ట్స్ బ్యానర్ స్థాపించి మొదటి ప్రయత్నంగా 'రోగ్' సినిమాను నిర్మించింది. అప్పటి నుంచి నిర్మాతగా కొనసాగుతోంది.

మొదట్లో రెండు మూడు ఫ్లాపులు పలకరించినా నిరాశచెందకుండా ప్రయాణం కొనసాగించడంతో 'ఇస్మార్ట్ శంకర్' రూపంలో విజయం వరించింది. బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిత్రం అందరికీ లాభాలు తీసుకురావడమే కాకుండా ఛార్మికి నిర్మాతగా మంచి పేరు తీసుకొచ్చింది. సినిమా సూపర్ హిట్ కావడంతో రిలీజ్ అయిన మొదటి నుంచి జోరుగా వేడుకలు జరుగుతూ ఉన్నాయి.

నిన్న ఛార్మి తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేస్తూ "నా లేటెస్ట్ పిక్ ఆడుతున్న అందరికీ #ఇస్మార్ట్ శంకర్ #సక్సెస్" అంటూ ట్వీట్ చేసింది. ఇక ఫోటో విషయానికివస్తే ఒక చేతిలో వైన్ గ్లాసు పట్టుకొని ఫుల్ జోష్ లో నవ్వుతో మిడిల్ ఫింగర్ చూపిస్తోంది. మరి ఆ మధ్యవేలు ఎవరికి చూపిస్తోందో చెప్పలేదు కానీ.. ఇస్మార్ట్ శంకర్ ను అదేపనిగా విమర్శించిన వారికే ఈ వేలు అంకితం ఇచ్చిందేమో!