Begin typing your search above and press return to search.

పండూ ఐ లవ్ యూ.. ఆల్వేస్: పూరి జగన్నాధ్

By:  Tupaki Desk   |   6 Sep 2019 8:00 AM GMT
పండూ ఐ లవ్ యూ.. ఆల్వేస్: పూరి జగన్నాధ్
X
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ 'ఇస్మార్ట్ శంకర్' తో తన కెరీర్లో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన విజయ్ దేవరకొండతో చేయనున్న నెక్స్ట్ ఫిలిం 'ఫైటర్' కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ తో బిజీగా ఉన్నారు. ఈరోజు పూరి జగన్నాధ్ మ్యారేజ్ యానివర్సరీ. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ తో అందరినీ తనవైపుకు తిప్పుకున్నారు.

పూరి సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటారు కానీ తన సతీమణి లావణ్య గురించి ఎప్పుడూ ప్రస్తావించరు. తనతో కలిసి ఉన్న ఫోటోలు కూడా షేర్ చేసుకోరు. అయితే గత కొన్ని రోజులుగా తన సతీమణితో కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా మరోసారి ఆమెతో కలిసి ఉన్న ఓ బ్యూటిఫుల్ ఫోటో పోస్ట్ చేసి "23 వ యానివర్సరీ. పండూ ఐ లవ్ యూ.. ఆల్వేస్" అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఫోటోలో పూరి తన సతీమణిని ఒడిలో కూర్చోబెట్టుకొని ఒక లవ్లీ పోజిచ్చారు. భార్యభర్తలు ఇద్దరూ చూడముచ్చటగా నవ్వుతున్నారు.

గత కొంత కాలంగా పూరికి సీనియర్ యాక్ట్రెస్ కమ్ ప్రొడ్యూసర్ ఛార్మీకి మధ్య ఏదో జరుగుతోందని వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ అవి జస్ట్ రూమర్లేనేని.. తమ మధ్య ప్రొఫెషనల్ రిలేషన్ షిప్ మాత్రమే ఉందని క్లారిటీ ఇస్తూ ఆ వార్తలను ఇద్దరూ తోసిపుచ్చడం జరిగింది. తాజాగా ఈ ఫోటోతో పూరి తన వైఫ్ లావణ్యతో అనుబంధం సజావుగానే ఉందని పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు. ఇక ఛార్మీ కూడా సేమ్ ఫోటోను తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేసి "ఇద్దరికీ హ్యాపీ యానివర్సరీ. ఇద్దరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి" అంటూ మ్యారేజ్ యానివర్సరీ శుభాకాంక్షలు తెలిపారు. దీంతో పాటుగా తను ప్రస్తుతం డిజిటల్ డీటాక్స్(సోషల్ మీడియాకు కొద్దిరోజులు దూరంగా ఉండడం)లో ఉన్నానని.. త్వరలో మళ్ళీ రెగ్యులర్ అప్డేట్స్ తో టచ్ లో ఉంటానని వెల్లడించారు.