Begin typing your search above and press return to search.

స‌మంత‌తో స్క్రీన్ షేరింగ్ పై చైతు క్రేజీ ఆన్స‌ర్‌!

By:  Tupaki Desk   |   1 Aug 2022 5:30 AM GMT
స‌మంత‌తో స్క్రీన్ షేరింగ్ పై చైతు క్రేజీ ఆన్స‌ర్‌!
X
చూస్తుండగానే నాగ చైతన్య - సమంత విడిపోయి ప‌ది నెల‌లు గ‌డిచిపోయాయి. దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట‌.. త‌మ రిలేషన్ షిప్ ను నెక్స్ట్ లెవల్ కి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణయం తీసుకున్నారు. వీరి పెళ్లికి ఇరు కుటుంబ స‌భ్యులు అంగీక‌రించ‌డంతో.. 2017లో గోవా వేదిక‌గా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. చైతు-సామ్ ల వివాహం అప్ప‌ట్లో ఎంతో ఘ‌నంగా జ‌రిగింది.

రెండు ఆచారాల ప్రకారం ఒక‌టైన ఈ జంట‌.. పెళ్లికి ముందే కాదు త‌ర్వాత కూడా జంట‌గా న‌టించారు. ఆన్ స్క్రీన్ లోనూ, ఆఫ్ స్క్రీన్ లోనూ మోస్ట్ రొమాంటిక్ అండ్ ల‌వ‌బుల్ క‌పుల్ గా గుర్తింపు పొందారు. కానీ, ఎక్కువ కాలం సామ్‌-చైతూలు క‌లిసి ఉండ‌లేక‌పోయారు. పెళ్లై నాలుగేళ్లు గ‌డ‌వ‌క ముందే డివోర్స్ తీసుకుంటున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు.

ప్ర‌స్తుతం ఎవ‌రి లైఫ్ తో వారు బిజీ అయిపోయిన‌ప్ప‌టికీ.. త‌ర‌చూ వీరిద్ద‌రిపై ఏదో ఒక న్యూస్ ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఇదిలా ఉంటే.. యువ సామ్రాట్ అక్కినేని నాగ చైత‌న్య త్వ‌ర‌లోనే 'లాల్ సింగ్ చ‌డ్డా'తో బాలీవుడ్ లోకి అడుగు పెట్ట‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్, కరీనా కపూర్ ఇందులో జంట‌గా న‌టించారు. చైతు ఓ కీల‌క పాత్ర‌ను పోషించాడు.

అద్వైత్ చంద‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం ఆగ‌స్టు 11న పాన్ ఇండియా లెవ‌ల్లో విడుద‌ల కానుంది. తెలుగులో ఈ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతున్న తరుణంలో అమీర్ ఖాన్ తో క‌లిసి చైతు కూడా జోరుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నాడు. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న చైతు.. సినిమాకు సంబంధించిన విష‌యాలే కాకుండా వ్య‌క్తిగ‌త విషయాల‌ను సైతం షేర్ చేసుకున్నాడు.

ఈ క్ర‌మంలోనే యాంక‌ర్ చైతూను ఓ ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న వేసింది. 'ఆన్ స్క్రీన్ పై సమంతతో మీ కెమిస్ట్రీకి అద్భుత‌మైన రెస్పాన్స్ వచ్చింది. మ‌రి ఫ్యూచ‌ర్ లో ఆమెతో క‌లిసి మ‌రోసారి స్క్రీన్ షేర్ చేసుకునే అవ‌కాశం ఉందా..?' అని ప్ర‌శ్నించ‌గా.. అందుకు చైతు గ‌ట్టిగా న‌వ్వుతూ ఆన్స‌ర్ ఇచ్చాడు. 'ఒకవేళ అలా జరిగితే చాలా క్రేజీగా ఉంటుందేమో.. కానీ అది జరుగుతుందో లేదో నాకు తెలియదు.. ఈ ప్రపంచానికే తెలియాలి' అని చైతు బ‌దులిచ్చాడు.

మొత్తానికి సామ్ తో స్క్రీన్ షేరింగ్ పై చైతు కూల్ గా ఇచ్చిన ఈ రిప్లై నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటోంది. కాగా, ఈయ‌న తెలుగు సినిమాల విష‌యానికి వ‌స్తే.. రీసెంట్ గా 'థ్యాంక్యూ' మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించి బిగ్ డిజాస్ట‌ర్ ను ఖాతాలో వేసుకున్నాడు. ప్ర‌స్తుతం చైతు విక్ర‌మ్ కె. కుమార్ డైరెక్ష‌న్‌లో 'దూత‌' అనే వెబ్ సిరీస్, వెంకట్ ప్రభుతో ఓ ద్విభాషా చిత్రం చేస్తున్నాడు.