Begin typing your search above and press return to search.

కామెంట్‌: రాఖీ పండుగనాడు ఇరగదీశారే

By:  Tupaki Desk   |   7 Aug 2017 1:54 PM GMT
కామెంట్‌: రాఖీ పండుగనాడు ఇరగదీశారే
X
భారతదేశంలో కులమతాలకు అతీతంగా ప్రతి అన్నాచెల్లెల్లు, అక్కాతమ్ముళ్లు చేసుకునే పండగా రాఖీ. రక్త సంబంధంతో పాటు మానవత్వ విలువలను పెంచే ఈ పండగలో ఎదురుగా వచ్చే ప్రతి స్త్రీని గౌరవించాలనేది అసలు సిద్ధాంతం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎంత గొప్ప స్త్రీ అయినా ఈ పండగ రోజు తన సోదరుడికి ప్రేమగా రాఖీ కట్టాలని చూస్తుంది. అయితే ఈ రాఖీ పండగని తెరపై అలరించే సెలబ్రెటీలు కూడా ఎంతో ఆనందంగా చేసుకుంటారు. ,ముఖ్యంగా కొంత మంది హీరియిన్స్ అయితే సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్నా.. ప్యాకప్ చెప్పేసి రెండు రోజుల ముందే రాఖి పండగ కోసం వారి ఇంటికి వెళ్లారట.

ఈ రాఖీ సందర్బంగా హీరోయిన్స్ వారి సోదరులకు రాఖీ కట్టి వారి ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. నిన్ననే కొత్త సినిమా తొలి షెడ్యూల్ పూర్తిచేసుకుని బ్రేక్ తీసుకుంటున్న మెగా హీరో వరుణ్‌ తేజ్ కు చెల్లెలు నిహారికే కాదు.. అక్కయ్య శ్రీజ కూడా రాఖీ కట్టింది. అలాగే మంచు విష్ణుకు అక్క లక్ష్మీ రాఖీ కట్టింది. ఇక రకుల్ ప్రీత్ సింగ్ అయితే తన బిజీ షెడ్యూల్ ని పక్కన పెట్టేసి.. తన తమ్ముడుకి రాఖీని కట్టింది. ఇక మరో టాప్ హీరయిన్ కాజల్ అయితే తన ఫ్యామిలీతో వారం గ్యాప్ వచ్చినా తట్టుకోలేదు.. ఇక అసలే రాఖీ పండగ ఉండడంతో తన కజిన్స్ అందరిని పిలిపించి రాఖీని ఘనంగా సెలబ్రేట్ చేసుకుందట. అలాగే నిన్ను కోరి ఫెమ్ నివేత థామస్ తన ఒక్కగానొక్క బ్రథర్ అయిన నిఖిల్ తో కలిసి రాఖీ పండగని ఔటింగ్ వెళ్లి మరి చేసుకుందట. ఇక బాలీవుడ్ హీరయిన్ పరిణితి చోప్రా కూడా తన ఇద్దరి సోదరులకి రాఖీ కట్టి మంచి ట్రీట్ ఇచ్చానని చెప్పుకొచ్చింది. ఇదే తరహాలో హన్సికా - అనుపమ పరమేశ్వరన్ - పూర్ణ వంటి వారు సింపుల్ గా వారి ఒక్కగానొక్క సోదరులతో ఇంట్లోనే రాఖీలను కట్టి ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్నారు.

ఇక హీరో విశాల్ షూటింగ్ లో బిజీగా ఉండడంతో సెట్ కి వచ్చి మరీ అతని చెల్లి ఐశ్వర్య కృష్ణ రాఖీ కట్టింది. సినిమా లైఫ్ లో ఎంతో రాయల్ లైఫ్ అనుభవిస్తూ..బిజీ షెడ్యూల్ ని వదిలేసుకొని మరి రాఖీ కట్టి రక్త సంబంధాన్ని మరింత దగ్గర చేసుకుంటున్నారు ఈ తారలు.