Begin typing your search above and press return to search.

నెటిజన్స్ దెబ్బకు కామెంట్ సెక్షన్ బ్లాక్ చేసుకుంటున్న సెలబ్రిటీలు...!

By:  Tupaki Desk   |   24 Sep 2020 5:34 PM GMT
నెటిజన్స్ దెబ్బకు కామెంట్ సెక్షన్ బ్లాక్ చేసుకుంటున్న సెలబ్రిటీలు...!
X
యువ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌ పుత్‌ మృతి కేసుతో వెలుగులోకి వచ్చిన బాలీవుడ్ డ్రగ్స్‌ వ్యవహారం సినీ పరిశ్రమలో తీవ్ర ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే రియా చక్రవర్తితో పాటు ఆమె సోదరుడు షోవిక్‌ చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్టు చేసింది. ఈ క్రమంలో స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకుణే - శ్రద్ధా కపూర్‌ - సారా అలీఖాన్‌ సహా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కు ఎన్‌సీబీ సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలో క్వాన్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ మేనేజర్ జయ సాహా వాట్సాప్ చాటింగ్ ఆధారంగా పలువురు డ్రగ్స్ కేసులో ఇవాల్వ్ అయ్యారని వార్తలు వచ్చాయి. ఇప్పటికే జయ సాహా ఎన్సీబీ అధికారుల విచారణకు హాజరవడంతో ఇండస్ట్రీలో క్వాన్ తో సంబంధాలు ఉన్న సెలబ్రిటీలు అందరూ టెన్షన్ పడుతున్నారని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో డ్రగ్ మాఫియాతో లింకులు ఉన్నాయని వార్తల్లో వచ్చిన సెలబ్రిటీలను నెటిజన్స్ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళు ఏ పోస్ట్ పెట్టినా దాని క్రింద 'మీరు డ్రగ్స్ తీసుకుంటారా? మీ ఫేవరేట్ డ్రగ్ ఏంటి?' అంటూ టార్గెట్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. నెటిజన్స్ ట్రోల్ దెబ్బకు తట్టుకోలేక సెలబ్రిటీలు అందరూ ట్విట్టర్ ఇంస్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా మాధ్యమాలలో కామెంట్స్ ని పరిమితం చేయడంతో పాటు బ్లాక్ చేస్తున్నారని తెలుస్తోంది. కేవలం వాళ్ళు ఫాలో అయ్యేవారే కామెంట్స్ పెట్టేలా సెట్టింగ్స్ చేంజ్ చేసుకుంటున్నారు. సెలబ్రిటీలు ఈ విషయంలో ఎప్పటి నుంచో కామెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉంటున్నప్పటికీ.. డ్రగ్స్ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత అందరూ ఇదే ఫాలో అవుతున్నారని తెలుస్తోంది.