Begin typing your search above and press return to search.

బుట్టబొమ్మ ఎక్క‌డుంటే అక్క‌డే ప‌చ్చ‌ద‌నం

By:  Tupaki Desk   |   27 Nov 2021 12:30 AM GMT
బుట్టబొమ్మ ఎక్క‌డుంటే అక్క‌డే ప‌చ్చ‌ద‌నం
X
రాజ్య‌స‌భ స‌భ్యుడు.. తెరాస‌ నేత సంతోష్ కుమార్ త‌ల పెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దేశవ్యాప్తంగా ఎంత ఫేమ‌స్ అయిందో తెలిసిందే. సెల‌బ్రిటీలను టార్గెట్ చేస్తూ సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ ని విసురుతుంటారు. దీంతో టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ సెల‌బ్రిటీలు ఈ కార్య‌క్ర‌మంలో ఎంతో బాధ్య‌త‌గా పాల్గొన్నారు. ఆ మ‌ధ్య బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ హైద‌రాబాద్ ఎయిర్ పోర్టులో మొక్క‌లు నాటి ఇది అంద‌రి బాధ్య‌త అంటూ ప్ర‌చారం చేశారు. అలాగే నాగ‌చైత‌న్య‌..చిరంజీవి....టాలీవుడ్ హీరోయిన్లు ఇలా చాలా మంది ఈ చాలెంజ్ ని స్వీక‌రించి స‌క్సెస్ చేసారు.

తాజాగా బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే కూడా ఈ ఛాలెంజ్ లో పాల్గొంది. మొక్క‌లు నాటి వాటికి నీళ్లు పోస్తూ ఉన్న కొన్ని ఫోటోల్ని ఇన్ స్టాలో షేర్ చేసింది. ఓ ప‌బ్లిక్ పార్క్ లో పూజా మొక్క‌లు నాటింది. ఇటీవ‌లే పూజా మాల్దీవులు వెకేష‌న్ ని ముగించుకుని తిరిగి షూటింగ్ ల్లో బిజీ అయింది. ఇలా ఖాళీ స‌మయం దొర‌క‌డంతో గ్రీన్ ఇండియా ఉద్య‌మం వైపు మ‌న‌సు మ‌ళ్లించింది. అయితే ఈ చాలెంజ్ కారణంగా చాలా మంది అప్ క‌మింగ్ హీరోయిన్లు ఫేమ‌స్ అవుతున్నారు. పెద్ద పెద్ద సెల‌బ్రిటీలు అంతా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన‌డంతో దేశ వ్యాప్తంగా చాలా గుర్తింపు తెస్తోంది.

నిజానికి ఈ ప్రోగ్రామ్ ఈ స్థాయిలో రీచ్ అవుతుంద‌ని ఎవ్వ‌రూ ఊహించి ఉండ‌రు. ఆ ఛాలెంజ్ విసిరింది ఓ రాజ‌కీయ నాయ‌కుడు అయినా అంద‌రూ ఓ బాధ్య‌త‌గా తీసుకోవ‌డం విశేషం. కొంత మంది హీరోయిన్లు అయితే ఈ ఛాలెంజ్ ని ప‌బ్లిసిటీకి కూడా వినియోగించుకుని స‌క్సెస్ అయ్యారు. పూజా హెగ్డే కి ప్ర‌చారం అవ‌స‌రం లేక‌పోయినా ఇలా కూడా పాపుల‌రైంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కి స‌హ‌క‌రించిన పూజాకి సంతోష్ కుమార్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఇటీవ‌లే మాల్దీవుల వెకేష‌న్ లో భాగంగా ప్ర‌త్యేక‌ ఐడెంటిటీ కోసం కోటి వ‌ర‌కూ ఈ ట్రిప్ కి ఖ‌ర్చు చేసింది అన్న ప్ర‌చారం సాగింది. మ‌రి ఇందులో నిజాలు తెలియాల్సి ఉంది. ప్ర‌స్తుతం పూజా హెగ్డే `ఆచార్య‌`..`రాధేశ్యామ్` చిత్రాల్లో న‌టించింది. ఇవి త‌దుప‌రి రిలీజ్ కి రెడీ అవుతున్నాయి.