Begin typing your search above and press return to search.

త్వరలో పీరియాడిక్ డ్రామాతో తెరమీదకు బర్నింగ్ స్టార్..!

By:  Tupaki Desk   |   9 March 2021 12:15 PM GMT
త్వరలో పీరియాడిక్ డ్రామాతో తెరమీదకు బర్నింగ్ స్టార్..!
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో బర్నింగ్ స్టార్ అంటే గుర్తుపట్టని వారిండరు. ఎందుకంటే మనిషి షార్ట్ కావచ్చు కానీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాక తక్కువ కాలంలోనే మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అతనే సంపూర్ణేశ్ బాబు. 2014లో మొదటి సినిమా 'హృదయ కాలేయం'తోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు సంపూ. కానీ వరుసగా అదే సక్సెస్ రేట్ మెయింటైన్ చేయలేకపోయాడు. ఫస్ట్ సినిమా తర్వాత వరుసగా పరాజయాలను ఖాతాలో వేసుకున్నాడు. అయితే భారీ విరామం తర్వాత కొబ్బరిమట్ట అనే సినిమాతో ఓ మోస్తరు హిట్ అందుకున్నాడు. తన ప్రతీ సినిమాలో ఏదొక ప్రయోగం చేసే సంపూ.. ఆమధ్య ఏకంగా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్నట్లు తెలిపాడు. అదే సమయంలో సంపూ పుట్టినరోజు సందర్బంగా ఆ చిత్రయూనిట్ సంపూ సినిమా పోస్టర్ కూడా విడుదల చేసింది.

ఇంకా పేరు కూడా పెట్టని ఈ సినిమా ఓ మెడికల్ థ్రిల్లర్ గా రూపొందుతుందని సమాచారం. ఆ పోస్టర్లలో వుహాన్ గబ్బిలాల మార్కెట్ లో చిత్రీకరించిన చివరి సినిమా ఇదేనంటూ ఆసక్తి రేకేత్తించారు. కానీ లాక్డౌన్ ముగిసి ఇన్నినెలలు గడుస్తున్నా ఆ సినిమా ఊసే లేదు. ఆ విషయం పక్కనపెడితే.. త్వరలో మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసేపనిలో ఉన్నాడట సంపూ. 'క్రేజీ అంకుల్స్' అనే సినిమా రూపొందిస్తున్న కిరణ్ తలసియా దర్శకత్వంలో ఆ సినిమా ఉండబోతుందట. అలాగే సంపూ ప్రధానపాత్రధారిగా నటించనున్న ఈ సినిమాకు 'గోల్డ్ మ్యాన్' అనే పేరును పరిశీలిస్తున్నారట. అదికూడా ఓ పీరియడిక్ డ్రామాగా తెరకెక్కనుందని సినీవర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మొత్తానికి సంపూ మళ్లీ ఫామ్ లోకి వస్తాడనే ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.