Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్ : అతీంద్రియ శక్తులతో భయపెడుతున్న 'బుల్బుల్'...!

By:  Tupaki Desk   |   19 Jun 2020 10:10 AM GMT
ట్రైలర్ టాక్ : అతీంద్రియ శక్తులతో భయపెడుతున్న బుల్బుల్...!
X
బాలీవుడ్ బ్యూటీ అనుష్క శ‌ర్మ అటు స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూనే ఇటు ప్రొడక్షన్ లోకి దిగిన సంగతి తెలిసిందే. క్లీన్‌ స్లేట్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్ లో 'ఎన్ హెచ్ 10' 'పారి' వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన అనుష్క శర్మ ఇటీవల ‘పాతాళ్‌ లోక్‌’ వెబ్‌ సిరీస్‌ ను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చింది. ఈ క్రమంలో అనుష్క ప్రస్తుతం ‘బుల్బుల్’ అనే సినిమా నిర్మించింది. ఇప్పటికే ఈ సినిమాకి సంభందించిన టీజర్ రిలీజ్ కాగా మంచి ఆదరణ దక్కించుకుంది. ఇప్పుడు తాజాగా 'బుల్బుల్' ట్రైలర్ కూడా విడుదల చేసారు చిత్ర యూనిట్. సస్పెన్స్ అండ్ న్యాచుర‌ల్ థ్రిల్ల‌ర్ స్టోరీతో తెర‌కెక్కుతున్న ఈ చిత్ర ట్రైలర్ ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు.

కాగా ‘బుల్బుల్’ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా కనిపిస్తుంది. 'నీకొక కథ చెప్తాను వింటావా' అని ఇద్దరు పిల్లల మాట్లాడుకోవడంతో ఈ ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత సుమారు 8 ఏళ్ళ వయసుండే ఒక బాలికని తనకంటే ఏజ్ లో చాలా పెద్దవాడైన వ్యక్తి పెళ్లి చేసుకుంటాడు. మొత్తం మీద ఈ ట్రైలర్ చూస్తుంటే టైటిల్ కి తగ్గట్టే 'బుల్బుల్' అనే యువతి చుట్టూ ఈ సినిమా స్టోరీ తిరుగుతుందని అర్థం అవుతోంది. 'బుల్బుల్' చిన్నప్పటి నుండే తన చిన్ననాటి స్నేహితుడు సత్య ని ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమెకు చిన్నప్పుడే బాల్యవివాహం చేసి ఒక రాయల్ ఫ్యామిలీకి కోడలిగా పంపిస్తారు. ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమాలో బాల్య వివాహాలతో పాటు ఫెయిరీ టేల్స్ చెప్తున్నట్లుగా అనిపిస్తోంది. ఏదో కొత్త ఇమాజినేషన్ తో క్రియేటివ్ గా ట్రై చేస్తున్నారని అర్థమవుతోంది. ఇక ట్రైలర్ లో చూపిస్తున్న విజువల్స్ కి బ్యాగ్రౌండ్ స్కోర్ కలవడంతో ఇంకా భయపెట్టేలా ఉన్నాయి. కచ్చితంగా ప్రేక్షకులను భయపెడుతుంది అనే అభిప్రాయాన్ని కలిగిస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా ‘స్వీయ శోధన, రహస్యం, కుట్రలకు సంబంధించి అతీంద్రియ శక్తులు ఉన్న బుల్బుల్ అనే అమ్మాయి అందమైన కథ’ అన్ని అనుష్క శర్మ ప్రకటించింది. ఈ చిత్రాన్ని అనుష్క శర్మ తన సోద‌రుడు క‌ర్ణేశ్‌ తో క‌లిసి నిర్మించింది. కాగా అన్వితా దత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తృప్తీ డిమ్రీ ‘బుల్బుల్’ పాత్రను పోషిస్తున్నారు. నటుడు రాహుల్ బోస్ ఆమె భర్త మహేంద్ర పాత్రలో నటించాడు. తృప్తితో పాటు అవినాష్ తివారీ కూడా ఈ చిత్రంలో కనిపించనున్నారు. వీరిద్దరూ గతంలో 'లైలా మజ్ను' సినిమాలో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ సినిమా జూన్ 24న నెట్‌ ఫ్లిక్స్ ఓటీటీలో విడుద‌ల కానుంది.