Begin typing your search above and press return to search.

ఇటలీలో ఖిలాడీ షూటింగ్ కి బ్రేక్.. కార‌ణం తెలిస్తే షాక్!

By:  Tupaki Desk   |   29 March 2021 4:39 AM GMT
ఇటలీలో ఖిలాడీ షూటింగ్ కి బ్రేక్.. కార‌ణం తెలిస్తే షాక్!
X
మాస్ మ‌హారాజా ర‌వితేజ ప్ర‌స్తుతం `ఖిలాడీ` చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. గ‌త కొద్ది రోజులుగా ర‌వితేజ‌తో పాటు ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న అన‌సూయ భ‌ర‌ద్వాజ్ ఫోటోలు వీడియోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతున్నాయి. నా రోల్ షూటింగ్ పూర్త‌యింది అంటూ అన‌సూయ ఇంత‌కుముందు వెల్ల‌డించారు.

తాజాగా యాక్ష‌న్ కింగ్ అర్జున్ తో పాటు ర‌వితేజ ఆన్ లొకేష‌న్ ఫోటో ఒక‌టి స‌ర్ ప్రైజ్ చేస్తోంది. అయితే ఖిలాడీ బృందం మ‌రీ ఇంత తీరిగ్గా ఇట‌లీలో ఉందా? అంటే షాకింగ్ విష‌యం తెలిసింది. నిజానికి గ‌త కొద్దిరోజులుగా ఇట‌లీలో కొన్ని న‌గ‌రాల్లో క‌రోనా మ‌హ‌మ్మారీ విజృంభించ‌డంతో అధికారికంగా లాక్ డౌన్ ప్ర‌క‌టించారు. అందువ‌ల్ల షూటింగులు ఎక్క‌డివ‌క్క‌డే నిలిచిపోయాయి. దీంతో ఖిలాడీ టీమ్ కి కావాల్సినంత తీరిక స‌మ‌యం చిక్కింద‌ట‌. ఆ క్ర‌మంలోనే అక్క‌డి నుంచి వ‌రుస‌గా ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తూ ఖిలాడీ కి ప్ర‌చారం చేసుకుంటున్నార‌ని తెలిసింది.

ఖిలాడి బృందం కొన్ని వారాల క్రితం ఇటలీకి వెళ్లింది. ఒక పాట,.. పోరాట సన్నివేశం .. కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. కానీ ఈలోగానే షూటింగ్ జరుగుతున్న నగరంలో లాక్ డౌన్ కారణంగా షూటింగ్ అకస్మాత్తుగా నిలిచిపోయింది. సినిమా ప్రమోషన్ కోసం ఖాళీ సమయాన్ని వినియోగించుకోవడం విశేషం. గత రెండు రోజులుగా ఇటలీ నుంచి ఖిలాడీ ఫోటోలు వీడియోలు రిలీజ్ చేయ‌డం వెన‌క అంత క‌థ ఉందని తెలిసింది. ఇక షూట్ పూర్త‌యినా అనసూయ అక్క‌డే లాక్ అయిపోయారట‌. ఈ చిత్రంలో ర‌వితేజ పూర్తి యంగ్ లుక్ తో క‌నిపిస్తున్నారు. మీనాక్షి చౌదరి- డింపుల్ హయతి త‌దిత‌రులు ఇందులో న‌టిస్తున్నారు. రమేష్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.