Begin typing your search above and press return to search.

'అఖండ' కు థర్డ్‌ వేవ్‌ కు లింక్ పెట్టిన బోయపాటి

By:  Tupaki Desk   |   1 July 2021 7:37 AM GMT
అఖండ కు థర్డ్‌ వేవ్‌ కు లింక్ పెట్టిన బోయపాటి
X
నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీనుల కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న అఖండ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవల కాలంలో బాలయ్య సినిమా అంటే పెద్దగా ఇంట్రెస్ట్‌ చూపించని వారు కూడా బోయపాటి దర్శకత్వం లో బాలయ్య చేసిన సినిమా అవ్వడం వల్ల భారీ అంచనాలతో ఎదురు చూస్తున్నారు. అఖండ సినిమాకు ఏ రేంజ్‌ లో బజ్ ఉందనేది ఆ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా వంద కోట్లకు పైగానే ప్రీ రిలీజ్‌ బిజినెస్ చేసిందట. అంతటి బజ్‌ ఉన్న ఈ సినిమా ను విడుదల చేసేది ఎప్పుడా అంటూ నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మే నెలలోనే ఈ సినిమా ను విడుదల చేయాలని అధికారింగా తేదీని కూడా ప్రకటించారు. కాని అనూహ్యంగా సెకండ్‌ వేవ్‌ వల్ల షూటింగ్ కూడా పూర్తి చేయలేక పోయారు. కరోనా సెకండ్‌ వేవ్‌ కాస్త తగ్గుముఖం పట్టినట్లుగా అనిపిస్తుంది. ఇప్పటికే హీరోలు అంతా కూడా తమ తమ షూటింగ్ లను పునః ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాని అఖండ విషయంలో మాత్రం ఎలాంటి అప్ డేట్ లేక పోవడంతో అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు దర్శకుడు బోయపాటి శ్రీను ఇటీవల తిరుమలలో అఖండ గురించి స్పందించాడు.

తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న తర్వాత బోయపాటి మీడియాతో మాట్లాడాడు. ఆ సందర్బంగా అఖండ సినిమా విశేషాలను తెలియజేశాడు. షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుందని పేర్కొన్నాడు. ఒక పాట.. క్లైమాక్స్‌ సన్నివేశాలు.. రెండు మూడు రోజుల ప్యాచ్‌ వర్క్‌ మాత్రమే మిగిలి ఉన్నట్లుగా పేర్కొన్నాడు. ఇక విడుదల విషయానికి వస్తే ఇప్పట్లో చెప్పలేమన్నట్లుగా క్లారిటీ ఇచ్చేశాడు. మళ్లీ థర్డ్‌ వేవ్‌ అంటున్నారు. కనుక ఆ పరిస్థితుల గురించి క్లారిటీ వచ్చే వరకు అఖండ విడుదల ఉండక పోవచ్చు అంటూ బోయపాటి అన్నాడు. అఖండ షూటింగ్‌ ను అతి త్వరలోనే పునః ప్రారంభిస్తారు. ఆ తర్వాత థర్డ్‌ వేవ్‌ గురించి ఎలాంటి హడావుడి లేకుంటే అప్పుడు విడుదల తేదీ గురించి ఆలోచించే అవకాశం ఉంది.

అంతా అనుకున్నట్లుగా జరిగితే సినిమా ను దసరా కు విడుదల చేయవచ్చు అంటున్నారు. అయితే థర్డ్‌ వేవ్‌ లేకుంటేనే అంటూ బోయపాటి స్పష్టం చేశాడు. ఒక వేళ థర్డ్‌ వేవ్‌ ప్రభావం ఎక్కువ ఉంటే మాత్రం ఈ ఏడాదిలో అఖండ విడుదల అనుమానమే అంటూ మీడియా వర్గాల వారిలో చర్చ జరుగుతోంది. ప్రగ్జా జైస్వాల్‌ హీరోయిన్‌ గా నటించిన ఈ సినిమాలో పూర్ణ కీలక పాత్రలో కనిపించబోతుంది. ఈ సినిమాలో శ్రీకాంత్‌ మెయిల్‌ విలన్ గా కనిపించబోతున్నట్లుగా టాక్‌ వినిపిస్తుంది.