Begin typing your search above and press return to search.

మూడు ఖండాల్లో స్టార్ హీరో దుమారం

By:  Tupaki Desk   |   8 Jun 2019 7:32 AM GMT
మూడు ఖండాల్లో స్టార్ హీరో దుమారం
X
శ్రీ‌దేవి- బోనీక‌పూర్ కుటుంబంతో త‌ళా అజిత్ కి ఉన్న అనుబంధం గురించి తెలిసిందే. కోలీవుడ్ లో బోనీక‌పూర్ కి అజిత్ నుంచి అన్ని ర‌కాలా స‌హ‌కారం ఉంటుంది. ఇక ఇప్పుడు ఆ బంధం వ‌రుస‌గా భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి తెర తీయ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. తొలిగా తాప్సీ క‌థానాయిక‌గా న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `పింక్` ను త‌మిళంలో రీమేక్ చేస్తున్న బోనీక‌పూర్ అందులో త‌ళా అజిత్ ని క‌థానాయ‌కుడిగా ఎంపిక చేసుకున్నారు. అజిత్ - బోనీ క‌పూర్ కాంబినేష‌న్ మూవీగా ఇప్ప‌టికే ఈ చిత్రానికి బోలెడంత పాపులారిటీ ద‌క్కింది. పింక్ (2016) రీమేక్ `నేర్కొండ పార‌వై` చిత్రాన్ని ఆగ‌స్టు 10న రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పై ఉండ‌గానే అజిత్ హీరోగా బోనీ ఓ అంత‌ర్జాతీయ స్థాయి సినిమాకి స‌న్నాహాలు చేస్తుండ‌డం మార్కెట్ వ‌ర్గాల్ని వేడెక్కిస్తోంది.

ఈ సినిమాని బాలీవుడ్ స‌హా ఖండాంత‌రాలు దాటి ప‌లు దేశాల్లో రిలీజ్ చేయాల‌న్న ప్లాన్ తో బోనీకపూర్ భారీగా బ‌డ్జెట్ ని వెచ్చిస్తున్నార‌ని తెలుస్తోంది. కార‌ణం ఏదైనా అజిత్ త‌న మార్కెట్ రేంజును మ‌రో మూడు ఖండాల్లోకి విస్త‌రించ‌బోతున్నారు. ద‌క్షిణాఫ్రికా- మిడిల్ ఈస్ట్- బుడాపెస్ట్ త‌దిత‌ర చోట్ల త‌న సినిమాని భారీ రేంజులో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశార‌ని తెలుస్తోంది.

పింక్ త‌ర్వాత అజిత్ - బోనీ కాంబినేష‌న్ బాలీవుడ్ మూవీకి ఇప్ప‌టికే స్క్రిప్టు ప‌నులు స‌హా ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నులు సాగుతున్నాయి. ఆగ‌స్టులో సినిమాని ప్రారంభించి నాలుగు షెడ్యూల్స్ లో పూర్తి చేస్తార‌ట‌. ఇంకా త‌మిళ వెర్ష‌న్ టైటిల్ ని ప్ర‌క‌టించ‌లేదు. ఇంత‌కీ ఈ భారీ సినిమా క‌థాంశం ఏంటి? అంటే.. కార్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో ఇంట్రెస్టింగ్ డ్రామాతో తెర‌కెక్కించనున్నార‌ని తెలుస్తోంది. యూనివ‌ర్శ‌ల్ అప్పీల్ ఉన్న టైటిల్ కోసం టీమ్ వెతుకుతున్నార‌ట‌. ఇక అజిత్ స్వ‌త‌హాగానే బైక్ రేస‌ర్. ప‌లు మోటార్ సైకిల్ ఛాంపియ‌న్ షిప్స్ లోనూ అత‌డు పాల్గొన్న అనుభ‌వం ఉంది. అందువ‌ల్ల అత‌డి సూచ‌న‌లు రీమేక్ స్క్రిప్టుకు పెద్ద సాయ‌మ‌య్యాయ‌ని నిర్మాత బోనీక‌పూర్ చెబుతున్నారు. ఇక అజిత్ కి బాలీవుడ్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటే .. 2001లో `ఆశోక` అనే మ‌ల్టీస్టార‌ర్ లో ఓ అతిధి పాత్ర‌ను పోషించాడు. చాలా కాలం త‌ర్వాత అజిత్ న‌టించ‌నున్న తాజా చిత్రాన్ని బాలీవుడ్ ఆడియెన్ తో పాటు అటు ఖండాంత‌రాల్లో ఆడియెన్ కి స‌రిప‌డే క‌థాంశంతో ప్లాన్ చేస్తుండ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. అజిత్ కి అటు త‌మిళ‌నాడు స‌హా ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబ‌ట్టి తెలుగులోనూ రిలీజ‌య్యే వీలుంది.