Begin typing your search above and press return to search.

'జనతా గ్యారేజ్' రీమేక్ లో బాలీవుడ్ స్టార్ హీరో..?

By:  Tupaki Desk   |   10 July 2021 4:30 PM GMT
జనతా గ్యారేజ్ రీమేక్ లో బాలీవుడ్ స్టార్ హీరో..?
X
టాలీవుడ్ స్టార్ హీరోలందరితో సినిమాలు చేస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో ఓ సినిమా చేయనున్నాడని గత రెండు రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు కండల వీరుడికి ఏకంగా 10 కోట్ల రూపాయల అడ్వాన్స్ కూడా ఇచ్చారని.. స్టార్ హీరో 2023 లో డేట్స్ ఇచ్చాడని అన్నారు. అయితే తాజాగా స‌ల్మాన్ ఖాన్ తో మైత్రీ వారు చేయబోయేది ''జనతా గ్యారేజ్'' సినిమా రీమేక్ అని ఓ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ''జనతా గ్యారేజ్''. మలయాళ సూపర్ స్టార్‌ మోహన్‌ లాల్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంలో సమంత - నిత్యా మీనన్ హీరోయిన్ లుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా 2016లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాన్నే ఇప్పుడు మైత్రీ టీమ్ సల్మాన్ తో రీమేక్ చేయాలని చూస్తున్నారని టాక్ వినిపిస్తోంది. స‌ల్మాన్ ఖాన్ పార్ట‌న‌ర్ షిప్ లో ఈ సినిమా తెర‌కెక్క‌నుందని అంటున్నారు.

ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ను డైరెక్ట్ చేసే దర్శకుడి కోసం మైత్రీ బృందం వేతుకుతోందట. దీని కోసం ఇప్పటికే 'జనతా గ్యారేజ్' ను రూపొందించిన కొరటాల శివ ను సంప్రదించారట. అయితే స్టార్ డైరెక్టర్ వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండటంతో నిర్మాతలు మరో దర్శకుడి కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. కాకపోతే ప్రస్తుతం అగ్ర దర్శకులందరూ ఆల్రెడీ వేరే ప్రాజెక్ట్స్ కు కమిటై ఉన్నారు. మరి సల్మాన్ ఖాన్ తో సినిమా చేసేది నిజమే అయితే.. మైత్రీ వారికి చివరకు ఏ దర్శకుడు దొరుకుతాడో చూడాలి.