Begin typing your search above and press return to search.

మ‌ళ్లీ తెర‌పైకి బ్లాక్ బ‌స్ట‌ర్ కాంబో!

By:  Tupaki Desk   |   8 July 2022 7:31 AM GMT
మ‌ళ్లీ తెర‌పైకి బ్లాక్ బ‌స్ట‌ర్ కాంబో!
X
కొన్ని కాంబినేష‌న్ లు రిపీట్ అయితే ప్రేక్ష‌కుల్లో క‌నిపించే జోషే వేరు. మ‌ళ్లీ అలాంటి కాంబినేష‌న్ ఎప్పుడు సెట్ట‌వుతుందా?.. ఎప్పుడెప్పుడు వారి క‌ల‌యిక‌లో సినిమా వ‌చ్చేస్తుందా? అని ఆస‌క్తిగా ఎదురుచూస్తుంటారు. అలాంటి బ్లాక్ బ‌స్ట‌ర్‌ కాంబినేష‌న్ మ‌ళ్లీ తెర‌పైకి రాబోతోందని తెలిసింది. అదే కొర‌టాల శివ - పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ కాంబో. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన తొలి యాక్ష‌న్ బ్లాక్ బ‌స్ట‌ర్ 'మిర్చి'. ఈ మూవీ ద్వారానే కొర‌టాల శివ ద‌ర్శ‌కుడిగా అరంగేట్రం చేశారు.

2013లో వ‌చ్చిన ఈ చిత్రం బాక్సాఫీస వ‌ద్ద భారీ విజ‌యాన్ని సాధించిన ఈ ఇద్ద‌రి కెరీర్ లో తిరుగులేని బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. మ‌ళ్లీ ఇన్నేళ్ల త‌రువాత ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ కాంబో మ‌ళ్లీ రిపీట్ కాబోతోందని తెలుస్తోంది. స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ఇటీవ‌ల మెగాస్టార్ చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ ల కాంబినేష‌న్ లో తెర‌కెక్కించిన చిత్రం 'ఆచార్య‌'. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ మూవీ భారీ డిజాస్ట‌ర్ గా నిలిచి కొర‌టాల‌కు గ‌ట్టి షాకిచ్చిన విష‌యం తెలిసిందే.

ఈ మూవీ ఇచ్చిన షాక్ నుంచి తేరుకున్న కొర‌టాల శివ స్టార్ హీరో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో ఓ భారీ పాన్ ఇండియా మూవీకి శ్రీ‌కారం చుడుతున్న విష‌యం తెలిసిందే. స్క్రిప్ట్ వర్క్ ఫైన‌ల్ స్టేజ్ కి చేరుకున్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది.

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో యువ సుధా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై సుధాక‌ర్ మిక్కిలినేని ఈ మూవీని నిర్మించ‌బోతున్నారు. ఇటీవ‌లే ఈ మూవీ డైలాగ్ మోష‌న్ పోస్ట‌ర్ ని విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే.

ఇదిలా వుంటే ఇటీవ‌ల హీరో ప్ర‌భాస్ ని క‌లిసిన కొర‌టాల మ‌ళ్లీ క‌లిసి ఓ ప్రాజెక్ట్ చేద్దామ‌ని చ‌ర్చించార‌ట‌. ప్ర‌భాస్ కూడా పాజిటివ్ గా స్పందించి ఓకే చెప్పిన‌ట్టుగా తెలుస్తోంది. అంద‌తే కాకుండా ఈ ప్రాజెక్ట్ ని కూడా యువీ క్రియేష‌న్స్ లో చేయాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. ప్ర‌భాస్ ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ భారీ ప్రాజెక్ట్ ల‌లో న‌టిస్తున్నారు. 'కేజీఎఫ్' ఫేమ్‌ ప్ర‌శాంత్ నీల్ తో 'స‌లార్‌', నాగ్ అశ్విన్ తో 'ప్రాజెక్ట్ కె' చిత్రాలు చేస్తున్నారు. ఓమ్ రౌత్ తో చేసిన 'ఆది పురుష్‌' ఇప్ప‌టికే పూర్త‌యి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది.

ప్ర‌శాంత్ నీల్ 'స‌లార్‌', నాగ్ అశ్విన్ 'ప్రాజెక్ట్ కె' చిత్రాలు పూర్త‌యిన త‌రువాతే కొర‌టాల ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకొస్తార‌ట‌. ఈలోగా కొర‌టాల త‌ను ఎన్టీఆర్ తో చేయ‌బోతున్న మూవీని పూర్తి చేసి స్క్రిప్ట్ వ‌ర్క్ ని స్టార్ట్ చేస్తార‌ట‌. యువీ క్రియేష‌న్స్ రామ్ చ‌ర‌ణ్ - గౌత‌మ్ తిన్న‌నూరి కాంబినేష‌న్ లో ఓ మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. అంతే కాకుండా ప‌లు చిన్న చిత్రాల‌కు అసోసియేట్ గానూ వ్య‌వ‌హ‌రిస్తోంది.