Begin typing your search above and press return to search.

‘జైభీమ్’ను ప్రశంసిస్తూనే హీరోను కార్నర్ చేస్తున్నారుగా..!

By:  Tupaki Desk   |   4 Nov 2021 3:30 PM GMT
‘జైభీమ్’ను ప్రశంసిస్తూనే హీరోను కార్నర్ చేస్తున్నారుగా..!
X
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన 'జైభీమ్' ఇటీవల విడుదలైంది. అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ మంచి ఆదరణతో ముందుకు దూసుకెళుతోంది. ఐదు భాషల్లో రిలీజైన 'జైభీమ్' విమర్శకుల ప్రశంసలను అందుకుంటోంది. అయినప్పటికీ కొన్ని వివాదాలు మాత్రం ఈ మూవీని వెంటాడుతుండటం ఆసక్తిని రేపుతున్నాయి.

ఈ మూవీలో భాగంగానే నటుడు ప్రకాశ్(ఐజీ)తో ఓ వ్యక్తి హిందీలో మాట్లాడుతుంటాడు. ఆ సమయంలో ప్రకాశ్ రాజ్ ఆ వ్యక్తిని ఒక్కటి పీకీ తమిళంలో మాట్లాడమంటాడు. ఈ సీన్ ను తప్పుబడుతూ నార్త్ ఇండియన్స్ కు చెందిన కొందరు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. దీనిని తమిళులు సైతం అదేరేంజులో తిప్పికొడుతుండటం విశేషం.

తాజాగా బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్. రాజా హీరో సూర్యను టార్గెట్ చేశారు. గతంలో సూర్య చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఆయన గుర్తు చేస్తున్నారు. 'మన పిల్లలకు మూడు భాషలు వద్దంటూ హీరో సూర్య గతంలో వ్యాఖ్యలు చేశారని.. కానీ ఇప్పుడు ఆయన సినిమాలను ఏకంగా ఐదు భాషల్లో ఎలా రిలీజ్ చేస్తారంటూ' ట్వీటర్ వేదికగా ప్రశ్నించారు.

ఇలాంటి వారిని ఏమని అర్థం చేసుకోవాలంటూ ఆయన కామెంట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే ఈ ట్వీట్ చూసిన హీరో సూర్య మాత్రం లైక్ కొట్టి తన స్పందన తెలియజేయడం కొసమెరుపు. తన చేతలకు, మాటలకు తేడా లేదని చెప్పడానికి సూర్య ఇలా చేసినట్లు కన్పిస్తుంది. ఇదిలా ఉంటే సూర్య అభిమానులను మాత్రం సదరు బీజేపీ నేతపై ఓ రేంజులో మండిపడుతున్నారు.

'జైభీమ్' సినిమాలో సూర్య నిమ్నజాతి వర్గాలకు న్యాయం చేసేలా పోరాడుతాడు. అధికార బలంతో అణిచివేయాలని చూసేవారికి న్యాయస్థానం ద్వారా సరైన గుణపాఠం చెబుతాడు. అయితే సదరు బీజేపీ నేతలు తమను తాము అణిచివేత దారులుగా ఫీలై ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని సూర్య ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. దీంతో రాజా ట్వీట్ కాస్తా నెట్టింట్లో వైరల్ అవుతోంది.